AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“మోడీ గారూ.! ఇతనిపై CBI దర్యాప్తు చేయించండి.. 10 వేల కోట్లు తిన్నాడు…”

ప్రధాని నరేంద్ర మోడీ హైద‌రాబాద్ ప‌ర్యట‌న‌లో అందరూ నమ‌స్తే పెట్టారు కానీ ఓ వ్యక్తి మాత్రం ఒక ప‌త్రం ఇచ్చారు. సార్ కొంచెం దీని గురించి..

మోడీ గారూ.! ఇతనిపై CBI దర్యాప్తు చేయించండి.. 10 వేల కోట్లు తిన్నాడు...
TV9 Telugu
| Edited By: |

Updated on: Feb 07, 2022 | 9:33 PM

Share

ప్రధాని నరేంద్ర మోడీ హైద‌రాబాద్ ప‌ర్యట‌న‌లో అందరూ నమ‌స్తే పెట్టారు కానీ ఓ వ్యక్తి మాత్రం ఒక ప‌త్రం ఇచ్చారు. సార్ కొంచెం దీని గురించి ప‌ట్టించుకోండి అంటూ వేడుకున్నాడు. అయితే ఆ స‌ద‌రు నేత‌ మోడీని ఇక్రిసాట్‌లో క‌లిసారు. ఆయన అక్కడ క‌లిసిన విజువ‌ల్స్ కూడా బ‌య‌ట‌కు రాలేదు. ఒక రోజు ఆలస్యంగా అయ‌న మోడీకి విన‌తి పత్రం ఇస్తున్న ఫోటో సోషల్ మీడియా ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కు ఆ ప‌త్రంలో ఏముందనే చ‌ర్చ ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

నందీశ్వర్ గౌడ్.. ప‌టాన్‌చెరువు మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఇటీవల అయ‌న హైద‌రాబాద్‌లో ప్రధాని నరేంద్రమోడీని ఇక్రిసాట్‌లో క‌లిశారు. ఇక్రిసాట్ పటాన్‌చెరువు ప‌రిధిలోకి వ‌స్తుంది. అక్కడి స్థానిక బీజేపీ నాయ‌కుడు కావ‌డంతో మోడీని క‌లిసే వారిలో నందీశ్వర్ గౌడ్ పేరు ఉంది. మోడీని క‌లిసిన సమయంలో ఆయన ఓ లెటర్ ఇచ్చారు.

ఆ లేఖ‌లో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిపై మోడీకి ఫిర్యాదు చేశారు నందీశ్వర్ గౌడ్. మైపాల్ రెడ్డి త‌న కుటుంబ స‌భ్యులు కొంతమంది క‌లిసి పటాన్‌చెరువులో చెరువులు, గ్రేవ్ యార్డులు, వక్ఫ్‌ బోర్డ్ భూములు, గుడులు ఇలా దాదాపు రూ.10 వేల కోట్లు విలువ చేసే భూముల‌ను కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంత‌మంది పొలీసులు అధికారుల‌తో కుమ్మక్కై నకిలీ డాక్యుమెంట్లతో అక్కడి ప్రజలను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌నే ఆరోపణలు ఉన్నాయని నందీశ్వర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

మైపాల్ రెడ్డి ఇప్పటికే ఒక కేసులో రెండున్నరేళ్లు జైలు శిక్ష పడ్డా.. తెలంగాణ ప్రభుత్వం అండదండలతో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, ఈ విష‌యంపై సీబీఐ దర్యాప్తు చేయాలని నందీశ్వర్ గౌడ్ మోడీని కోరారు. ఈ అంశాన్ని ప్రధాని తప్పకుండా పరిశీలించి.. తగిన న్యాయం చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

Telangana: మణికొండ జాగీర్‌ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వం విజయం.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Punjab Elections: రాజకీయాల్లోకి ‘దేవ్ డి’ నటి మహి గిల్.. హర్యానా ముఖ్యమంత్రి సమక్షంలో బీజేపీలో చేరిక

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?