AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. రోజుకు 20 మంది మృతి!

గత రెండేళ్లలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగినట్లు తెలంగాణ పోలీసుల తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2023లో నమోదైన ప్రమాదాలు 22,900 కాగా, 2025 నాటికి అవి 27,300కు పెరిగినట్లు సమాచారం. 2020 నుండి ఈ పెరుగుదల నిరంతరంగా కొనసాగుతుండగా, అదనంగా సుమారు 2,000 కేసులు..

తెలంగాణలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. రోజుకు 20 మంది మృతి!
Road Accidents In Telangana
Vijay Saatha
| Edited By: |

Updated on: Apr 14, 2026 | 5:48 PM

Share

హైదరాబాద్‌, ఏప్రిల్ 14: రాష్ట్రంలో రోడ్డు భద్రత పరిస్థితులు రోజురోజుకీ ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండేళ్లలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగినట్లు తెలంగాణ పోలీసుల తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2023లో నమోదైన ప్రమాదాలు 22,900 కాగా, 2025 నాటికి అవి 27,300కు పెరిగినట్లు సమాచారం. 2020 నుండి ఈ పెరుగుదల నిరంతరంగా కొనసాగుతుండగా, అదనంగా సుమారు 2,000 కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. ఈ ప్రమాదాల్లో రోజుకు సగటున 20 మంది ప్రాణాలు కోల్పోతుండటం కలవరపెడుతోంది. మొత్తం 7,500కు పైగా ప్రాణనష్టాలు నమోదయ్యాయి. హైదరాబాద్ కంటే వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, సైబరాబాద్ మరియు రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అత్యధిక ఫాటల్ ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఈ మూడు ప్రాంతాలు కలిపి రాష్ట్రంలోని మొత్తం మరణాల్లో దాదాపు 28 శాతం వాటా కలిగి ఉన్నాయి.

ప్రమాదాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఓవర్‌స్పీడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం లేకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి అంశాలను అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఓవర్‌స్పీడింగ్ ఒక్కటే 70 శాతం ప్రమాదాలకు కారణమవుతోందని పోలీసులు చెబుతున్నారు. అదనంగా మొబైల్ ఫోన్ వినియోగం, అలసట, సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలు కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయి. వాహనాలకు సంబంధించిన ప్రమాదాలతో పాటు పాదచారుల మరణాలు కూడా ఆందోళనకరంగా మారాయి. సైబరాబాద్‌లో పాదచారుల మరణాలు రెండో స్థానంలో ఉండగా, మోసపేట్–పటాన్‌చెరు మార్గం అత్యంత ప్రమాదకరంగా గుర్తించబడింది. ఈ మార్గంలోనే అత్యధిక పాదచారి మరణాలు నమోదయ్యాయి. రోజంతా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటం ప్రమాదాలకు కారణమవుతోంది.

రోడ్డు భద్రతను మెరుగుపర్చేందుకు కేవలం స్పీడ్ కెమెరాలపై ఆధారపడకుండా, రోడ్ మార్కింగ్స్ మెరుగుపరచడం, ట్రాఫిక్ సిగ్నల్స్ అప్‌గ్రేడ్ చేయడం, స్పష్టమైన సిగ్నేజీలు ఏర్పాటు చేయడం, వేగ పరిమితులను కఠినంగా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా హైవేలు మరియు ఔటర్ రింగ్ రోడ్‌లపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ఓవర్‌టేకింగ్ మరియు నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రమాదాలను పెంచుతున్నాయని హెచ్చరిస్తున్నారు. అలసట, అకస్మాత్తుగా టైర్లు పేలడం వంటి అంశాలు కూడా ప్రమాదాలకు దారితీస్తున్నాయని రోడ్డు భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us