AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో మను బాకర్ ప్రభంజనం.. ముచ్చటగా మూడో పతకంపై గురి

ఇప్పటికే ఈ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలను ఈ యువ షూటర్‌ సాధించిన సంగతి తెలిసిందే. తొలుత 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. ఆ తర్వాత మరో షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించి ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇక మూడో పథకంపైనా గురిపెట్టింది మను...

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో మను బాకర్ ప్రభంజనం.. ముచ్చటగా మూడో పతకంపై గురి
Manu Bhaker
Jyothi Gadda
|

Updated on: Aug 02, 2024 | 9:55 PM

Share

భారత యువ షూటర్‌ మను బాకర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో సత్తా చాటుతోంది. ముచ్చటగా మూడో పతకానికి గురిపెట్టింది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను మరో విభాగంలోనూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. షూటింగ్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ పోరులో టాప్‌ 2లో నిలిచి.. తుది పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన క్వాలిఫికేషన్‌లో తొలుత ప్రిసిషన్‌ రౌండ్‌లో 294 పాయింట్లు సాధించి టాప్‌ 3లో నిలిచిన మను.. ఆ తర్వాత ర్యాపిడ్‌ రౌండ్‌లో మరింత పుంజుకుంది. ర్యాపిడ్‌ తొలి సిరీస్‌లో ఏకంగా 100 పాయింట్లు సాధించింది. ఈ రౌండ్‌లో 296 స్కోరు దక్కించింది. మొత్తంగా 590 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లి.. మరో పతకానికి అడుగు దూరంలో నిలిచింది.

తొలి స్థానంలో నిలిచిన హంగరీ షూటర్ వెరోనికా కంటే రెండు పాయింట్లు మాత్రమే తక్కువలో ఉంది మను బాకర్. శనివారం జరిగే ఫైనల్‌లో మనుకి పథకం ఖాయంగా వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. శనివారం జరిగే ఫైనల్‌ పోరులో మను పతకం సాధిస్తే.. ఈ ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్‌ పతకాలతో భారత ఒలింపిక్‌ చరిత్రలో సరికొత్త రికార్డును లిఖించనుంది.

ఇప్పటికే ఈ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలను ఈ యువ షూటర్‌ సాధించిన సంగతి తెలిసిందే. తొలుత 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గింది. ఆ తర్వాత మరో షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించి ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఇక మూడో పథకంపైనా గురిపెట్టింది మను. ఇదే విభాగంలో పోటీ పడిన మరో భారత షూటర్‌ ఇషా సింగ్‌ 581 పాయింట్లతో 18వ స్థానానికి పరిమితమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..