AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Paralympics: నేటి నుంచి ప్రారంభం కానున్న పారా ఒలింపిక్స్.. భారత్ పాల్గొనే ఈవెంట్స్ 27నుంచి స్టార్ట్

Para Olympics: టోక్యోలో మళ్ళీ ఒలింపిక్స్ సంబరం మొదలు కానుంది. నేటి నుంచి జపాన్ రాజధాని టోక్యో వేదికగా పారా ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కరోనా నిబంధనలను అనుసరిస్తూ.. ఒలింపిక్స్ కు..

Tokyo Paralympics: నేటి నుంచి ప్రారంభం కానున్న పారా ఒలింపిక్స్.. భారత్ పాల్గొనే ఈవెంట్స్ 27నుంచి స్టార్ట్
Tokyo Paralympics
Surya Kala
|

Updated on: Aug 24, 2021 | 11:50 AM

Share

Tokyo Paralympics 2020: టోక్యోలో మళ్ళీ ఒలింపిక్స్ సంబరం మొదలు కానుంది. నేటి నుంచి జపాన్ రాజధాని టోక్యో వేదికగా పారా ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కరోనా నిబంధనలను అనుసరిస్తూ.. ఒలింపిక్స్ కు అన్ని సిద్ధం చేశారు. ఈ పారా ఒలింపిక్స్ క్రీడల్లో మొత్తం 163 దేశాల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు పాల్గొన‌బోతున్నారు. మొత్తం 22 క్రీడాంశాల్లో 540 ప‌త‌క ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఇప్పుడు జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్, తైక్వాండో పోటీలను ప్రవేశపెట్టనున్నారు.

ఇక పారా ఒలింపిక్స్ లో 54మంది సభ్యులతో కూడిన భారత్ బృందం పాల్గొననుంది. అయితే 27నుంచి జరగనున్న ఈవెంట్స్ లో భారత క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ పోటీల్లో భారత్ నుంచి ఫేవరేట్ క్రీడాకారులుగా పారాలింపిక్‌ చాంపియన్లు దేవేంద్ర జఝారియా (ఎఫ్‌–46 జావెలిన్‌ త్రో), మరియప్పన్‌ తంగవేలు (టి–63 హైజంప్‌), ప్రపంచ చాంపియన్‌ సందీప్‌ చౌదరి (ఎఫ్‌–64 జావెలిన్‌ త్రో) బరిలోకి దిగనున్నారు.

ఇప్పటికే ఏథెన్స్‌(2004), రియో (2016) పారాలింపిక్స్‌లో పసిడి పతకాలను గెలుచుకున్న దేవేంద్ర మూడో సారి గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుంటున్నారు. గత పారాలింపిక్స్‌లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శనతో రెండు స్వర్ణాలు, రజతం, కాంస్యం గెలుపొందింది.

పారా ఒలింపిక్స్ లో భారత జట్టు క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి పతకాలను తీసుకుని రావాలని యావత్ క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు పారాలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్, భారత పారాలింపిక్‌ సంఘం అధికారులు, క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రికెటర్లు కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, భారత రెజ్లర్ రితూ ఫోటర్, యోగేశ్వర్ దత్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్, ఒలింపిక్ విన్నర్ కరణం మల్లీశ్వరి, బీసీసీఐ సెక్రటరీ జై షా తదితరులు శుభాకాంక్షలు తెలియచేశారు.

Also Read:  షూటింగ్‌లో గాయపడిన అభిషేక్ బచ్చన్.. ఆలస్యంగా వెలుగులోకి.. ఆందోళనలో ఫ్యాన్స్

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..