AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టొద్దు: పాక్ కెప్టెన్

ఇస్లామాబాద్: క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టొద్దని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. అనుకున్న ప్రకారం ప్రపంచ కప్‌లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగాలని అన్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలకు చెందిన కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మ్యాచ్ రద్దు చేయమనడం తనకు తీవ్ర నిరాశను కల్గించిందని వ్యాఖ్యానించాడు. తానేప్పుడు పాకిస్తాన్‌ రాజకీయాలతో మిళితమై క్రీడలను చూడలేదని, క్రీడలను ఎప్పుడూ క్రీడల్లానే చూడాలని పేర్కొన్నాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో […]

క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టొద్దు: పాక్ కెప్టెన్
Vijay K
| Edited By: |

Updated on: Mar 06, 2019 | 8:13 PM

Share

ఇస్లామాబాద్: క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టొద్దని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డాడు. అనుకున్న ప్రకారం ప్రపంచ కప్‌లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగాలని అన్నాడు. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలకు చెందిన కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో మ్యాచ్ రద్దు చేయమనడం తనకు తీవ్ర నిరాశను కల్గించిందని వ్యాఖ్యానించాడు. తానేప్పుడు పాకిస్తాన్‌ రాజకీయాలతో మిళితమై క్రీడలను చూడలేదని, క్రీడలను ఎప్పుడూ క్రీడల్లానే చూడాలని పేర్కొన్నాడు.

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దనే డిమాండ్ పెరిగింది. పాక్‌తో మ్యాచ్‌ ఆడాల్సిన వద్దంటూ అభిమానులు, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. అయితే సచిన్‌, గవాస్కర్‌లు వంటి వారు మాత్రం మ్యాచ్‌ను రద్దు చేసుకుంటే అది పాక్‌కే మేలు చేస్తుందని అన్నారు. బీసీసీఐ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది.