AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసీసీకి బీసీసీఐ ఘాటు లేఖ

న్యూఢిల్లీ: ఐసీసీకి బీసీసీఐ ఘాటు లేఖ రాసింది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న దేశాలను తక్షణమే తన సభ్య దేశాల జాబితా నుంచి తొలగించాలని ఐసీసీని డిమాండ్ చేసింది. పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించే ఈ డిమాండ్ చేసింది. బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ ఈ లేఖ రాశారు. ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై తమకు భద్రతాపరంగా అనుమానాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటగాళ్లు, అంపైర్లు, ఇతర సిబ్బంది భద్రతపై సందేహం వ్యక్తం చేశారు. భారత ఆటగాళ్లకు, అధికారులకు, […]

ఐసీసీకి బీసీసీఐ ఘాటు లేఖ
Vijay K
| Edited By: |

Updated on: Mar 06, 2019 | 8:13 PM

Share

న్యూఢిల్లీ: ఐసీసీకి బీసీసీఐ ఘాటు లేఖ రాసింది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న దేశాలను తక్షణమే తన సభ్య దేశాల జాబితా నుంచి తొలగించాలని ఐసీసీని డిమాండ్ చేసింది. పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించే ఈ డిమాండ్ చేసింది. బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ ఈ లేఖ రాశారు.

ఇంగ్లాండ్‌లో జరగనున్న ప్రపంచ కప్‌లో పాల్గొనడంపై తమకు భద్రతాపరంగా అనుమానాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటగాళ్లు, అంపైర్లు, ఇతర సిబ్బంది భద్రతపై సందేహం వ్యక్తం చేశారు. భారత ఆటగాళ్లకు, అధికారులకు, అభిమానులకు వరల్డ్ కప్‌లో ఎక్కువ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పుల్వామా దాడి ఘటనను యునైటెడ్ కింగ్‌డమ్‌తో సహా అనేక దేశాలు తీవ్రంగా ఖండిచాయని జోహ్రీ లేఖలో పేర్కొన్నారు.