AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sydney Ashes Test : క్రికెట్ చరిత్రలో కొత్త వింత..11 మందే జట్టు కానీ 12 మంది సెలక్ట్..ఆ టీం స్కెచ్ మామూలుగా లేదు

Sydney Ashes Test :సిడ్నీలో జరగబోయే ఐదో టెస్టులోనూ సత్తా చాటాలని ఇంగ్లీష్ టీమ్ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ కీలక మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. సాధారణంగా 11 మంది ప్లేయర్లను ప్రకటించే జట్టు, ఈసారి ఏకంగా 12 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.

Sydney Ashes Test : క్రికెట్ చరిత్రలో కొత్త వింత..11 మందే జట్టు కానీ 12 మంది సెలక్ట్..ఆ టీం స్కెచ్ మామూలుగా లేదు
England Squad
Rakesh
|

Updated on: Jan 02, 2026 | 3:43 PM

Share

Sydney Ashes Test : యాషెస్ సిరీస్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్నప్పటికీ, మెల్‌బోర్న్ టెస్టులో ఇంగ్లాండ్ అద్భుత విజయం సాధించి పరువు నిలబెట్టుకుంది. బెన్ స్టోక్స్ సారథ్యంలో దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఒక టెస్టు గెలిచిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది. అదే ఊపుతో సిడ్నీలో జరగబోయే ఐదో టెస్టులోనూ సత్తా చాటాలని ఇంగ్లీష్ టీమ్ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ కీలక మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ మేనేజ్‌మెంట్ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. సాధారణంగా 11 మంది ప్లేయర్లను ప్రకటించే జట్టు, ఈసారి ఏకంగా 12 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.

ఎందుకీ 12 మంది వ్యూహం?

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‎లో జనవరి 4, ఆదివారం నుంచి ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. అయితే సిడ్నీ వాతావరణం ప్రస్తుతం చాలా విచిత్రంగా ఉంది. సాధారణంగా అక్కడ ఎండలు ఎక్కువగా ఉండాలి, కానీ ఇప్పుడు చలి వాతావరణం నెలకొంది. దీనికి తోడు ఎస్సీజీ పిచ్ ఎప్పుడూ స్పిన్నర్లకు సహకరిస్తుంది, కానీ ఈసారి పిచ్‌పై గడ్డిని వదిలేశారు. ఇది పేసర్లకు వరంగా మారే అవకాశం ఉంది. పిచ్ కండిషన్స్, వాతావరణంపై స్పష్టత లేకపోవడంతో, టాస్ పడే సమయానికి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న కెప్టెన్ స్టోక్స్, అందుకే 12 మందిని ఎంపిక చేశారు.

ముగ్గురు పేసర్లు.. ఒక స్పిన్నర్

ఈ 12 మందిలో ఒక స్పిన్నర్, ముగ్గురు కీలక పేసర్లకు చోటు దక్కింది. మెల్‌బోర్న్ టెస్టులో ఆడిన జట్టులోని 10 మందిని యథాతథంగా కొనసాగిస్తూనే, ఇద్దరు కొత్త ప్లేయర్లను యాషెస్ సిరీస్‌లో మొదటిసారి బరిలోకి దించుతున్నారు. గస్ అట్కిన్సన్ గాయపడటంతో ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగంలో మార్పులు తప్పలేదు. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బ. ఈ నేపథ్యంలోనే బౌలింగ్ అటాక్‌ను పటిష్టం చేయడంపై ఇంగ్లాండ్ దృష్టి సారించింది.

ఆ ఇద్దరు ఎవరంటే?

ప్రస్తుత పర్యటనలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని పేసర్ మాథ్యూ పాట్స్, ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఈ 12 మంది జాబితాలో ఉన్నారు. పాట్స్ 2024 డిసెంబర్ తర్వాత మళ్ళీ ఇప్పుడే టెస్టు ఫీల్డ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక భారత్ పర్యటనలో అద్భుతంగా రాణించిన యంగ్ స్పిన్నర్ షోయబ్ బషీర్, గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చాడు. సిడ్నీ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే బషీర్ తుది జట్టులో ఉంటాడు, లేదంటే గడ్డి ప్రభావం ఎక్కువగా ఉంటే పాట్స్ కు అవకాశం దక్కుతుంది.

సిడ్నీ టెస్టుకు ఇంగ్లాండ్ ప్లేయింగ్-12: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, మాథ్యూ పాట్స్, షోయబ్ బషీర్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..