Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPW vs DC: ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్.. 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై ఘన విజయం..

WPL 2023: ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. మార్చి 26న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో నేరుగా ప్రవేశించింది.

UPW vs DC: ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్.. 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై ఘన విజయం..
Dc Vs Up Wpl 2023
Follow us
Venkata Chari

|

Updated on: Mar 21, 2023 | 11:07 PM

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) మొదటి ఎడిషన్ చివరి లీగ్ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచి నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మహిళలు పాయింట్ల పట్టికలో 12 పాయింట్లు సాధించారు. అయితే మెరుగైన నెట్ రన్‌రేట్ ఆధారంగా, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు మొదటి స్థానంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 139 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సాధించింది. ఓపెనింగ్ జోడీ కెప్టెన్ మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత షెఫాలీ 21 పరుగులు చేసి పెవిలియన్‌కు తిరిగి వెళ్లగా, కెప్టెన్ లానింగ్ 39 పరుగులు చేసి, జెమీమా కూడా 3 పరుగులు మాత్రమే చేయగలిగింది.

70 పరుగుల స్కోరు వద్ద 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను మరిజానే కేప్, అలిస్ కెప్సీ హ్యాండిల్ చేసి లక్ష్యాన్ని ఛేదించారు. వీరిద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 60 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. అలిస్ కెప్సీ, మరిజానే కేప్‌ల బ్యాట్‌తో తలో 34 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. యూపీ బౌలింగ్‌లో షబ్నిమ్ ఇస్మాయిల్ 2 వికెట్లు తీసింది.

ఇవి కూడా చదవండి

బౌలింగ్‌లో అలిస్ కెప్సీ, రాధా యాదవ్ అద్భుత ప్రదర్శన..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. యూపీ తరుపున ఇన్నింగ్స్ ప్రారంభించిన కెప్టెన్ అలిస్సా హీలీ, శ్వేతా సెహ్రావత్ తొలి వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి 6 ఓవర్లలో యూపీ జట్టు 38 పరుగులు మాత్రమే చేయగలిగింది.

63 పరుగుల వద్ద కెప్టెన్ హీలీ వికెట్ కోల్పోయిన తర్వాత, UP జట్టు తరచుగా విరామాలలో వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఈ కారణంగా జట్టు పెద్ద స్కోరు చేయడంలో విజయం సాధించలేకపోయింది. తహ్లియా మెక్‌గ్రాత్ ఖచ్చితంగా 32 బంతుల్లో 58 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడింది. ఈ కారణంగా జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగుల స్కోరును చేరుకోగలిగింది. ఢిల్లీ బౌలింగ్‌లో అలిస్ కెప్సీ 3 వికెట్లు తీయగా, రాధా యాదవ్ 2 వికెట్లు తీసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..