AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: లంక నుంచి కివీస్ వరకు.. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో నమోదైన 5 చెత్త రికార్డులు..

Team India Coach Gautam Gambhir: రాహుల్ ద్రవిడ్ తర్వాత, గౌతమ్ గంభీర్ టీమిండియాకు కోచ్‌గా వచ్చాడు. అయితే, గౌతమ్ ఎంట్రీతోనే టీమిండియాకు చెత్త రికార్డుల కాలం మొదలైంది. ఇది శ్రీలంకతోపాటు మొదలైన ఈ రికార్డుల పర్వం.. న్యూజిలాండ్ వరకు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ హయంలో నమోదైన 5 రికార్డులను ఓసారి చూద్దాం..

Team India: లంక నుంచి కివీస్ వరకు.. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో నమోదైన 5 చెత్త రికార్డులు..
Gautam Gambhir
Venkata Chari
|

Updated on: Oct 21, 2024 | 11:12 AM

Share

Team India Coach Gautam Gambhir: టీమ్ ఇండియా మాజీ వెటరన్ బ్యాట్స్‌మెన్, గౌతమ్ గంభీర్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ తర్వాత ప్రధాన కోచ్ పదవిని చేపట్టాడు. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐ, అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అతని కోచింగ్ హయాంలో భారత జట్టు కొన్ని గొప్ప ప్రదర్శనలను అందించగలిగినప్పటికీ, అది కొన్ని ఇబ్బందికరమైన రికార్డులను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.

గౌతమ్ గంభీర్ కోచ్‌గా మారి చాలా కాలం కాలేదు. కానీ, ఇప్పటివరకు అతని కోచింగ్‌లో చాలా సిగ్గుమాలిన రికార్డులు నమోదయ్యాయి. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా పేరు మీద నమోదైన 5 చెత్త రికార్డులను ఓసారి చూద్దాం..

5) 27 ఏళ్ల తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లో తొలిసారి శ్రీలంక చేతిలో ఓటమి..

గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. ఈ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమితో భారత్ 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్‌ను కోల్పోయింది. అంతకుముందు 1997లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ఓడిపోయింది.

4) మొదటిసారిగా 3 మ్యాచ్‌ల ODI సిరీస్‌లో మొత్తం 30 వికెట్లు కోల్పోయిన భారత్..

ప్రపంచ కప్ తర్వాత భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. అక్కడ 3 మ్యాచ్‌ల ODI సిరీస్‌లో టీం ఇండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ODI సిరీస్‌లో, భారత జట్టు మూడు మ్యాచ్‌లలో ఆలౌట్ కావడం గమనార్హం. దీనితో, 3 మ్యాచ్‌ల ODI సిరీస్‌లో మొదటిసారిగా మొత్తం 30 వికెట్లను కోల్పోయింది.

3) 19 ఏళ్ల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఓటమి..

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం గత 19 ఏళ్లుగా భారత క్రికెట్ జట్టుకు అభేద్యమైన కోటగా మారింది. భారత్‌ను ఏ ప్రత్యర్థి జట్టు ఓడించలేకపోయింది. కానీ, చివరికి ఈ దుర్భేద్యమైన కోట కూడా కూలిపోయింది. ఇక్కడ చిన్నస్వామిలో 19 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ జట్టుపై భారత్ ఓడిపోవాల్సి వచ్చింది. అంతకుముందు 2005లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

2) స్వదేశంలో మొదటిసారి 50 కంటే తక్కువ స్కోరుకే ఆలౌట్..

న్యూజిలాండ్‌పై టీమిండియా అత్యంత అవమానకరమైన రికార్డుల్లో ఒకటిగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు కేవలం 46 పరుగుల స్కోరుకే కుప్పకూలింది. దీంతో స్వదేశంలో భారత జట్టు అత్యల్ప స్కోరుకే ఔటైంది. స్వదేశంలో భారత్ తొలిసారి 50 కంటే తక్కువ స్కోరుతో ఔడిపోవాల్సి వచ్చింది.

1) 36 ఏళ్ల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి..

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత క్రికెట్ జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కివీస్ గత 36 సంవత్సరాలుగా భారత్ నుంచి ఏ టెస్ట్ మ్యాచ్‌ను గెలవలేదు. కానీ, చివరకు ఆ కరువును ముగించింది. 1988 తర్వాత భారతదేశంలో మొదటి టెస్ట్ మ్యాచ్‌ను గెలుచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..