AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Photo: ఇలా చూస్తే ఎమోషనల్ అవ్వాల్సిందే.. ఫ్యాన్స్ గుండెలను కలచివేస్తోన్న విరాట్ కోహ్లీ ఫొటో..

IND vs AUS Final: ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమి తర్వాత విరాట్ కోహ్లి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాడు.

Virat Kohli Photo: ఇలా చూస్తే ఎమోషనల్ అవ్వాల్సిందే.. ఫ్యాన్స్ గుండెలను కలచివేస్తోన్న విరాట్ కోహ్లీ ఫొటో..
Virat Kohli Viral Photo
Venkata Chari
|

Updated on: Jun 11, 2023 | 9:36 PM

Share

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ 209 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌ ఘోరంగా ఫ్లాప్‌ అయింది. విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగుల వద్ద ఔటయ్యాడు. భారత్ ఓటమితో అభిమానులు గుండెలు బాదుకున్నారు. ఈ మ్యాచ్‌కి సంబంధించిన కొన్ని చిత్రాలను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, వీటిలో ముఖ్యంగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఫొటో భావోద్వేగానికి గురిచేస్తోంది.

కోహ్లీ అభిమానులు అతనిపై చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. విరాట్‌ ఔట్‌ తర్వాత అతనిపై ట్విట్టర్‌లో చాలా రియాక్షన్‌లు కనిపించాయి. ఆస్ట్రేలియా విజయం తర్వాత, కోహ్లి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని దాటుతున్నాడు. ఆ సమయంలో విరాట్ ముఖం చాలా విచారంగా విచారంగా కనిపించింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

అజింక్యా రహానే ఔట్ కావడం కూడా టీమ్ ఇండియా అభిమానులను విషాదంలోకి నెట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో రహానే 89 పరుగులు చేశాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసి అవుటయ్యాడు. రహానే, శార్దూల్ ధాటికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులు చేసింది.

View this post on Instagram

A post shared by ICC (@icc)

రోహిత్ శర్మ అవుట్ కావడం కూడా టీమ్ ఇండియాకు నష్టమే. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 15 పరుగులకే రోహిత్ ఔటయ్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో జట్టుకు శుభారంభం అందించాడు. 43 పరుగుల వద్ద రోహిత్ పెవిలియన్‌కు చేరుకున్నాడు.

ముఖ్యంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 270 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 209 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..