AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ.. కట్‌చేస్తే.. ఊహించిన బిగ్ షాక్

Delhi Ranji Team Kohli Comeback: విరాట్ కోహ్లీ 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి పునరాగమనం చేయబోతున్నాడు. రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఈ క్రమంలో ఢిల్లీ జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli: 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ.. కట్‌చేస్తే.. ఊహించిన బిగ్ షాక్
Virat Kohli
Venkata Chari
|

Updated on: Jan 29, 2025 | 8:00 PM

Share

Virat Kohli Ranji Trophy Return: విరాట్ కోహ్లీ 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీకి పునరాగమనం చేయబోతున్నాడు. రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జనవరి 30 నుంచి ఢిల్లీ, రైల్వేస్ మధ్య గ్రూప్-డి మ్యాచ్ జరగనుంది. కోహ్లి దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేస్తున్నాడు. అతని ఢిల్లీ జట్టు ఈ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయ్యే అంచుకు చేరుకోవడం అతనికి బ్యాడ్ న్యూస్. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీతో కలిసి ఈ టోర్నీ నుంచి వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. రైల్వేస్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాలనే ఉద్దేశ్యంతో మైదానంలోకి దిగనున్న ఢిల్లీ జట్టులో బ్యాడ్ ఫేజ్‌ను ఎదుర్కొంటున్న కోహ్లి రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

రైల్వేస్ 6 మ్యాచ్‌లలో 17 పాయింట్లను కలిగి ఉంది. బోనస్ పాయింట్‌తో ఢిల్లీని ఓడిస్తే నాకౌట్‌కు చేరుకోవచ్చు. ఢిల్లీ ఆరు మ్యాచ్‌లలో 14 పాయింట్లు కలిగి ఉంది. సాంకేతికంగా వారు ఇంకా రేసులో ఉన్నారు. టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడం దాదాపు ఖాయం. తమిళనాడు 6 మ్యాచ్‌లలో 25 పాయింట్లు, చండీగఢ్ 6 మ్యాచ్‌లలో 19 పాయింట్లు, సౌరాష్ట్ర 18 పాయింట్లతో ఉన్నాయి. జాంటీ సిద్ధూ స్థానంలో కోహ్లి జట్టులోకి వస్తాడని అంతా భావించారు. మ్యాచ్‌కు ముందు కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్‌పై ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోనీ మాట్లాడుతూ- కోహ్లీ నాలుగో నంబర్‌లో దిగుతాడని తెలిపాడు.

కోట్లా పిచ్ పచ్చగా కనిపిస్తోంది. బదోని అదనపు ఫాస్ట్ బౌలర్‌తో వెళ్లాలని సూచించాడు. ఇటువంటి పరిస్థితిలో, మణి గ్రేవాల్ ప్లేయింగ్ ఎలెవన్‌కి తిరిగి రావొచ్చు. రైల్వేస్ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నారు. కోహ్లి కెప్టెన్సీలో 11 ఏళ్ల క్రితం అడిలైడ్‌లో అరంగేట్రం చేసిన కర్ణ్ శర్మతో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఉపేంద్ర యాదవ్ కూడా ఉన్నాడు. హిమాన్షు సాంగ్వాన్ ఫాస్ట్ బౌలింగ్‌లో స్ట్రైక్ బౌలర్‌గా బరిలోకి దిగనున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..