MS Dhoni: ధోని సరికొత్త అవతారం.. సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న భారత మాజీ సారథి ఫొటో..

MS Dhoni Pandit Avtar: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పండిట్ అవతార్ ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ధోనీ పసుపు రంగు కుర్తాలో కనిపిస్తున్నాడు.

MS Dhoni: ధోని సరికొత్త అవతారం.. సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న భారత మాజీ సారథి ఫొటో..
Ms Dhoni Pandit Avtar
Follow us

|

Updated on: Aug 11, 2022 | 6:05 AM

MS Dhoni Pandit Avtar: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడు. కానీ, ఆయన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహేంద్ర సింగ్ ధోని ఏదైనా కొత్త లుక్‌లో కనిపిస్తే చాలు.. సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతుంటాయి. ఈ రోజుల్లో అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఈ చిత్రంలో ధోనీ పండితుడి వేషధారణలో కనిపిస్తున్నాడు. భారత జట్టు దిగ్గజ కెప్టెన్‌లలో ఒకడిగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, పండిట్ వేషంలో ఉన్న ధోని ఫోటో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఈ లుక్‌లో ధోనీ పసుపు రంగు కుర్తా ధరించి కనిపిస్తున్నాడు. అదే సమయంలో ఈ వైరల్ ఫోటోలో ధోనీ చేతిలో ఒక దండ కూడా కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఫోటో ధోనీకి సంబంధించిన కొత్త ప్రకటనలా కనిపిస్తోంది.

అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై చెప్పినా ఐపీఎల్‌లో ధోనీ ప్రతాపం కనిపిస్తూనే ఉంది. అయితే ఐపీఎల్‌లో అతని హవా ఇంకా కనిపిస్తూనే ఉంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ధోనీని చూసేందుకు అభిమానులు ఎంతో ఆరాటపడుతుంటారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Isika Mahi (@isikamahi)

టీమిండియా అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, 2007లో భారత జట్టు కమాండ్‌ని స్వీకరించాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతను వెనుదిరిగి చూడలేదు. అతని కెప్టెన్సీలో భారత జట్టు టీ20 ప్రపంచకప్, 50 ఓవర్ల ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అదే సమయంలో అతని కెప్టెన్సీలో భారత్ టెస్టుల్లో నంబర్ వన్ జట్టుగా అవతరించింది.