AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: టీమిండియా షాకింగ్ న్యూస్.. పెర్త్ నుంచి భారత్‌కు తిరిగిరానున్న గౌతమ్ గంభీర్.. కారణం ఏంటంటే?

Gautam Gambhir: రెండు రోజుల పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సిన టీమిండియా నవంబర్ 27న పెర్త్ నుంచి కాన్‌బెర్రాకు బయలుదేరుతుంది. ఈ మ్యాచ్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. అయితే, అంతకుముందే గౌతమ్ గంభీర్ ఇండియాకు తిరిగి వస్తాడని వార్తలు వచ్చాయి.

IND vs AUS: టీమిండియా షాకింగ్ న్యూస్.. పెర్త్ నుంచి భారత్‌కు తిరిగిరానున్న గౌతమ్ గంభీర్.. కారణం ఏంటంటే?
India Coach Gautam Gambhir
Venkata Chari
|

Updated on: Nov 26, 2024 | 10:55 AM

Share

Gautam Gambhir: పెర్త్ టెస్టు గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. ఈ వార్త భారత్‌కు తిరిగి వస్తున్న భారత కోచ్ గౌతమ్ గంభీర్‌కు సంబంధించినది కావడం గమనార్హం. గంభీర్ హఠాత్తుగా తిరిగి రావడానికి గల కారణాలు వెల్లడి కాలేదు. అయితే, దీని వెనుక కారణం వ్యక్తిగతం అని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, గంభీర్ భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు కోచ్ ఎవరు చేయనున్నారనే సందేహాలు వస్తున్నాయి.

పింక్ బాల్ టెస్టుకు ముందే జట్టులో చేరనున్న గంభీర్..

భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు గులాబీ బంతితో జరగనుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. పింక్ బాల్ టెస్టు ప్రారంభానికి ముందే గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియాకు తిరిగి రావడం విశేషం.

బీసీసీఐకి సమాచారం..

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గంభీర్ భారత్‌కు తిరిగి రావడం గురించి బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని వెల్లడించింది. రెండో టెస్టుకు ముందే జట్టులోకి వస్తాడని కూడా పేర్కొంది. అతను తిరిగి రావడానికి గల కారణాన్ని మాత్రం చెప్పలేదు.

ఇవి కూడా చదవండి

నవంబర్ 27న పెర్త్ నుంచి కాన్‌బెర్రాకు వెళ్లనున్న టీమిండియా..

పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు కాన్‌బెర్రాకు వెళ్లనుంది. నవంబర్ 27న కాన్‌బెర్రాకు బయలుదేరుతుంది. అక్కడ రెండు రోజుల పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. గౌతమ్ గంభీర్ గైర్హాజరీలో భారత జట్టులోని సహాయ కోచ్ అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ వంటి సహాయక సిబ్బంది శిక్షణపై ఓ కన్నేసి ఉంచనున్నారు.

వ్యక్తిగత కారణాలతో రోహిత్ కూడా దూరం..

భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వ్యక్తిగత కారణాల వల్ల జట్టుతో కలిసి ఆస్ట్రేలియా చేరుకోలేదు. ఈ కారణంగా అతను తొలి టెస్టుకు అందుబాటులో లేడు. రోహిత్ రెండవ బిడ్డ కోసం భారత్‌లోనే ఉన్నాడు. అయితే, ఇప్పుడు రోహిత్ శర్మ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. అక్కడ కూడా పికప్ బాల్ తో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు గంభీర్ కూడా రెండో టెస్టుకు ముందే వస్తే.. టీమిండియాకు బాగుంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..