IND vs SA : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా.. ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ కోల్కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో మొదలైంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ కీలకమైన తొలి టెస్ట్కు భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రకటించిన తుది జట్టు అందరినీ ఆశ్చర్యపరిచింది.

IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ కోల్కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో మొదలైంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ కీలకమైన తొలి టెస్ట్కు భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రకటించిన తుది జట్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. తుది జట్టులో ఏకంగా నలుగురు స్పిన్నర్లను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంతో సాయి సుదర్శన్ను పక్కన పెట్టగా నంబర్ 3 స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే ప్రశ్న తలెత్తింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల ప్లేయింగ్ XI వివరాలు, తాజా అప్డేట్స్ తెలుసుకుందాం.
భారత్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ప్రారంభమైంది. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ తుది జట్టులో నలుగురు స్పిన్నర్లను (రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్) ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ ను జట్టు నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో నంబర్ 3 స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే ప్రశ్న తలెత్తింది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ నంబర్ 3 కోసం వాషింగ్టన్ సుందర్ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ ద్వారా రిషబ్ పంత్ ప్లేయింగ్ XI లోకి తిరిగి రాగా యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురెల్ కూడా జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
రెండు జట్ల తుది జట్లు
సౌతాఫ్రికా ప్లేయింగ్ XI: ఎడెన్ మార్క్రమ్, రియాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరిన్ (వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్.
భారత ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా తరఫున ఎడెన్ మార్క్రమ్, రియాన్ రికెల్టన్ ఓపెనింగ్ చేశారు. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్ వేశాడు. ఆ ఓవర్ రెండో బంతి బై రూపంలో నాలుగు పరుగులుగా వెళ్లడం విశేషం. మ్యాచ్ ప్రారంభానికి ముందు, భారత్, దక్షిణాఫ్రికా జట్లు మైదానంలో నిలబడి తమతమ జాతీయ గీతాలను ఆలపించాయి.
ఈ టెస్ట్ మ్యాచ్ ద్వారా భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒక అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధంగా ఉన్నాడు. టెస్ట్ క్రికెట్లో 4000 పరుగులు మరియు 300 వికెట్ల డబుల్ పూర్తి చేయడానికి జడేజాకు కేవలం 10 పరుగులు మాత్రమే అవసరం. ఈ మైలురాయిని చేరుకుంటే, ప్రపంచంలో ఈ ఘనత సాధించిన నాల్గవ క్రికెటర్గా జడేజా నిలుస్తాడు. గతంలో కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డేనియల్ వెటోరి మాత్రమే ఈ రికార్డును సాధించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
