AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens Emerging Asia Cup: 3 ఓవర్లు.. 2 రన్స్‌.. 5 వికెట్లు.. టీ20ల్లో రికార్డు సృష్టించిన టీమిండియా బౌలర్‌

మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 తొలి మ్యాచ్‌లోనే భారత మహిళలు చెలరేగారు. మోంగ్ కాక్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆతిథ్య హాంకాంగ్‌కు చుక్కలు చూపించారు భారత అమ్మాయిలు. ముఖ్యంగా లెగ్‌ స్పిన్నర్‌ శ్రేయాంక పాటిల్ బౌలింగ్ లో విధ్వంసం సృష్టించింది

Womens Emerging Asia Cup: 3 ఓవర్లు.. 2 రన్స్‌.. 5 వికెట్లు.. టీ20ల్లో రికార్డు సృష్టించిన టీమిండియా బౌలర్‌
Shreyanka Patil
Basha Shek
|

Updated on: Jun 13, 2023 | 1:10 PM

Share

మహిళల ఎమర్జింగ్ ఆసియా కప్ 2023 తొలి మ్యాచ్‌లోనే భారత మహిళలు చెలరేగారు. మోంగ్ కాక్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆతిథ్య హాంకాంగ్‌కు చుక్కలు చూపించారు భారత అమ్మాయిలు. ముఖ్యంగా లెగ్‌ స్పిన్నర్‌ శ్రేయాంక పాటిల్ బౌలింగ్ లో విధ్వంసం సృష్టించింది. 3 ఓవర్లు వేసిన ఆమె కేవలం 2 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. శ్రేయాంకతో పాటు పార్శ్వి చోప్రా, మన్నత్ కశ్యప్ తలా 2 వికెట్లు పడగొట్టడంతో 14 ఓవర్లలోనే 34 పరుగులు కుప్పకూలింది హంకాంగ్‌. జట్టులో కేవలం ఒక్క బ్యాటర్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు. నలుగురైతే అసలు ఖాతానే తెరవలేదు. ఈ మ్యాచ్‌లో శ్రేయాంక పాటిల్ కేవలం 18 బంతులు మాత్రమే వేసింది. అందులో ఆమె కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి హాంకాంగ్ జట్టులో సగం మంది బ్యాటర్లను పెవిలియన్‌ కు పంపించింది. ఈ మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే వికెట్‌ తీసి తన ఉద్దేశాన్ని చాటింది శ్రేయాంక. మొదట ఓవర్‌ లో మెరీనా లాంప్లోను బోల్తా కొట్టించిన పాటిల్‌ ఆ తర్వాతి ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టింది. హాంకాంగ్‌ ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో హిల్‌ని ఔట్‌ చేసిన శ్రేయాంక, తర్వాతి బంతికి బెట్టీ చాన్‌ కూడా బలి తీసుకుంది. ఐదో బంతికి మరో వికెట్‌ తీసిన శ్రేయాంక.. ఆ తర్వాత తన మూడో ఓవర్‌లో తొలి బంతికే వికెట్‌ తీసి ఐదు వికెట్ల క్లబ్‌లో చేరింది.

ప్రత్యర్థిని కేవలం 34 పరుగులకే కట్టడి చేయడంతో టీమిండియా విజయం ఖాయమైంది. పవర్‌ప్లే ముగియకముందే టీమ్ ఇండియా ఈ లక్ష్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఎ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా విజయానికి 32 బంతులు మాత్రమే పట్టింది. భారత కెప్టెన్ శ్వేతా సెహ్రావత్ కేవలం 2 పరుగులకే అవుటైనా వికెట్ కీపర్ ఛెత్రి, గొంగడి త్రిష సులువుగా టీమ్ ఇండియాను గెలిపించారు. జూన్ 15న నేపాల్‌తో భారత్ తదుపరి మ్యాచ్ ఆడాల్సి ఉండగా, జూన్ 17న పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?