AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందిరా మావ.. తొలుత 19 బంతుల్లో నత్తనడక.. ఆపై తర్వాతి 13 బంతుల్లో బ్లడ్ బాత్

CSK vs MI IPL Match: ఐపీఎల్ 2025లో భాగంగా 38వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున శివం దుబే, రవీంద్ర జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరూ కలిసి జట్టును గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లారు. ఈ సీజన్‌లో జడేజాకు ఇది తొలి అర్ధ సెంచరీగా నిలిచింది.

ఇదేందిరా మావ.. తొలుత 19 బంతుల్లో నత్తనడక.. ఆపై తర్వాతి 13 బంతుల్లో బ్లడ్ బాత్
Shivam Dubey
Venkata Chari
|

Updated on: Apr 21, 2025 | 9:21 AM

Share

Shivam Dubey Half Century: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 38వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు ఘన విజయం సాధించింది. అయితే, టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. జట్టు ప్రారంభంలో నెమ్మదిగా ఆరంభించింది. శివం దూబే, రవీంద్ర జడేజా చివరి ఓవర్లలో వేగంగా పరుగులు సాధించి, జట్టు స్కోర్‌ను 170 దాటించేలా చేశారు. అంతకుముందు, ముంబై బౌలర్లు ఇన్నింగ్స్‌ను ఓపెనింగ్ చేయడానికి వచ్చిన రచిన్ రవీంద్ర, షేక్ రషీద్‌లను వరుసగా పెవిలియన్‌కు పంపారు. రచిన్ కేవలం 5 పరుగులు చేసి ఔటయ్యాడు. రషీద్ 20 బంతుల్లో 19 పరుగులు చేశాడు. మూడో స్థానంలో వచ్చిన ఆయుష్ మహాత్రే తుఫాన్ బ్యాటింగ్ చేసి 21 బంతుల్లో 4 ఫోర్లు, 2 అద్భుతమైన సిక్సర్లతో 32 పరుగులు చేశాడు.

నెమ్మదిగా ప్రారంభించి, చివర్లో వేగం పెంచిన దూబే..

శివం దూబే బ్యాటింగ్‌కు వచ్చేసరికి చెన్నై స్కోరు 7.6 ఓవర్లలో మూడు వికెట్లకు 76 పరుగులు. శివం దూబే కూడా ప్రారంభంలో ఇబ్బంది పడ్డాడు. మొదటి 19 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తరువాత వేగంగా పరుగులు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో తర్వాతి 13 బంతుల్లో 34 పరుగులతో చెలరేగిపోయాడు. ఈ విధంగా, అతను 32 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్ల సహాయంతో 50 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో శివమ్‌కి ఇది తొలి అర్ధ సెంచరీ. అతను ఐపీఎల్ 2025లో 8 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 38.33 సగటుతో 230 పరుగులు చేశాడు.

ఇది కూడా చదవండి: ఒరేయ్, ఎవర్రా నువ్వు.. టీ20ల్లో చెత్త బ్యాటింగ్.. ఓపెనర్‌గా వచ్చి నాటౌట్‌గా నిలిచి.. ఎన్ని రన్స్ చేశాడో తెలుసా?

ఇవి కూడా చదవండి

రవీంద్ర జడేజా కూడా హాఫ్ సెంచరీ..

ఈ సీజన్‌లో రవీంద్ర జడేజా ముంబై ఇండియన్స్‌పై తన తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అతను 35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతను శివం దూబేతో కలిసి 50 బంతుల్లో 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ క్రీజులో ఉన్నప్పుడు, చెన్నై రెండు వందల మార్కును చేరుకుంటుందని అనిపించింది. కానీ జస్ప్రీత్ బుమ్రా శివం దూబేను అవుట్ చేయడంతో మరోసారి చెన్నై పరుగుల వేగానికి బ్రేకులు పడ్డాయి. ధోని కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. జడేజాకు ఓవర్టన్ మద్దతు ఇచ్చాడు. అతను 10 బంతుల్లో 13 పరుగులు చేసి జట్టు స్కోరును 176కి తీసుకెళ్లాడు. ముంబై తరపున జస్‌ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో 25 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ సాంట్నర్, అశ్వని కుమార్, దీపక్ చాహర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ సీజన్‌లో, రవీంద్ర జడేజా 8 మ్యాచ్‌ల్లో 8 ఇన్నింగ్స్‌లలో ఒక అర్ధ సెంచరీ, 29.00 సగటుతో 145 పరుగులు చేశాడు. 5 వికెట్లు పడగొట్టాడు.

ఇది కూడా చదవండి: సెంచరీతో తొడ కొట్టిన SRH ప్లేయర్.. కట్‌చేస్తే.. నిషేధానికి సిద్ధమైన బీసీసీఐ.. కారణం ఏంటంటే?

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..