AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా.. ఆ డబ్బుతో ఊళ్లో పదెకరాలు కొనొచ్చు

ఓవల్ టెస్టును చూసేందుకు వచ్చిన భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ధరించిన వాచ్‌ ధర ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అతను చేతికి పెట్టుకున్న Audemars Piguet వాచ్ ధర ఏకంగా రూ. 2.46 కోట్లు. ఈ డబ్బుతో ఒక చిన్న పట్టణంలో 10 ఎకరాల భూమిని కొనుగోలు చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా.. ఆ డబ్బుతో ఊళ్లో పదెకరాలు కొనొచ్చు
Rohit Sharma
Rakesh
|

Updated on: Aug 03, 2025 | 5:01 PM

Share

Rohit Sharma : భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్‌ను చూసేందుకు భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఓవల్ స్టేడియానికి వచ్చాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన రోహిత్, మూడో రోజు ఆటను వీక్షించేందుకు స్టేడియంలో కనిపించాడు. ఆ సందర్భంగా అతను ధరించిన దుస్తులు, ముఖ్యంగా చేతికి ఉన్న వాచ్ అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఆ వాచ్ ధర వింటే ఎవరైనా ఆశ్చర్యపోవడం ఖాయం.

ఓవల్ టెస్ట్ మూడో రోజు ఆటలో రోహిత్ శర్మ బ్లాక్ డెనిమ్ షాకెట్ మరియు జీన్స్‌లో చాలా సాధారణంగా కనిపించాడు. అయితే, అతని చేతికి ఉన్న ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్ జంబో ఎక్స్‌ట్రా-థిన్ స్మోక్డ్ బర్గుండీ టైటానియం వాచ్ చాలా స్పెషల్. ఈ వాచ్ ధర దాదాపు రూ.2.46 కోట్లు ఉంటుందని అంచనా. మ్యాచ్ చూసేందుకు వచ్చిన రోహిత్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మూడో రోజు ఆటలో అద్భుతమైన సెంచరీతో మెరిసిన యువ సంచలనం యశస్వి జైస్వాల్, ఆట తర్వాత రోహిత్ శర్మ గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. పోస్ట్-మ్యాచ్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో జైస్వాల్ మాట్లాడుతూ.. “నేను రోహిత్ భాయ్‌ను చూసి హాయ్ చెప్పాను. అతను నన్ను చూసి నువ్వు బ్యాటింగ్ చేస్తూ ఉండు అని మాత్రమే చెప్పారు” అని తెలిపాడు. సెంచరీ గురించి మాట్లాడుతూ.. “పిచ్ కొంచెం స్పైసీగా ఉంది. కానీ నేను బ్యాటింగ్ ఎంజాయ్ చేశాను. ఇంగ్లండ్‌లో ఇలాంటి పిచ్‌లపై ఆడతామని నాకు తెలుసు. నేను మానసికంగా సిద్ధమయ్యాను. ఏ షాట్లు ఆడాలనేది నాకు తెలుసు” అని చెప్పాడు.

యశస్వి జైస్వాల్ మూడో రోజు ఆటను నైట్‌వాచ్‌మెన్ ఆకాశ్ దీప్‌తో కలిసి ప్రారంభించాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 150 బంతుల్లో 107 పరుగులు జోడించి ఇంగ్లండ్ బౌలర్లను ఇబ్బందిపెట్టారు. ఆ తర్వాత కరుణ్ నాయర్ (40 పరుగులు), రవీంద్ర జడేజా (44 పరుగులు)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్ ఆధిక్యాన్ని పెంచాడు. జైస్వాల్ కేవలం 164 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 118 పరుగులు చేసి తన ఆరో టెస్ట్ సెంచరీని సాధించాడు. జైస్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 373 పరుగులు చేసి, ఇంగ్లండ్‌కు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

మరిన్ని  క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత్‌లో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన కారు..ధర తెలిస్తే షాకవుతారు
భారత్‌లో అమ్ముడవుతున్న అత్యంత ఖరీదైన కారు..ధర తెలిస్తే షాకవుతారు
పొద్దున్నే చాయ్ బిస్కెట్లు తింటున్నారా..? ఎంత డేంజరో తెలుసుకోండి!
పొద్దున్నే చాయ్ బిస్కెట్లు తింటున్నారా..? ఎంత డేంజరో తెలుసుకోండి!
గేమ్‌ ఛేంజర్‌ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రేవంత్ సర్కార్..!
గేమ్‌ ఛేంజర్‌ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టిన రేవంత్ సర్కార్..!
భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి...బూమ్రా సంచలన రికార్డు
భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి...బూమ్రా సంచలన రికార్డు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు..!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు..!
కొత్త ఏడాదిలో కార్‌ కొనాలని అనుకున్న వాళ్లకే పండగే!
కొత్త ఏడాదిలో కార్‌ కొనాలని అనుకున్న వాళ్లకే పండగే!
కాలికి నల్ల దారం కడుతున్నారా?.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే?
కాలికి నల్ల దారం కడుతున్నారా?.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే?
ప్రతి ఒక్కరూ చూడాలి.. ఆ స్టార్ హీరో మూవీపై రేణూ దేశాయ్ ప్రశంసలు
ప్రతి ఒక్కరూ చూడాలి.. ఆ స్టార్ హీరో మూవీపై రేణూ దేశాయ్ ప్రశంసలు
ఓలాను తొక్కేస్తున్న హీరో..! అమ్మకాల్లో దూసుకెళ్తూ..
ఓలాను తొక్కేస్తున్న హీరో..! అమ్మకాల్లో దూసుకెళ్తూ..
Horoscope Today: ముఖ్యమైన చిక్కు సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: ముఖ్యమైన చిక్కు సమస్యల నుంచి వారికి విముక్తి..