AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: టీ20ఐ విజయాల్లో టీమిండియా తగ్గేదేలే.. రోహిత్ సేన దెబ్బకు తారుమారైన ఆ టీంల రికార్డులు..

శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్, వెస్టిండీస్ టీంలను భారత్ ఓడించింది. ఈ రెండు జట్లను ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా చేసి సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది.

Rohit Sharma: టీ20ఐ విజయాల్లో టీమిండియా తగ్గేదేలే.. రోహిత్ సేన దెబ్బకు తారుమారైన ఆ టీంల రికార్డులు..
India Vs Sri Lanka Rohit Sharma
Venkata Chari
|

Updated on: Feb 28, 2022 | 3:24 PM

Share

స్వదేశంలో ఏ జట్టునైనా ఓడించడం చాలా కష్టమైనప్పటికీ, భారత క్రికెట్ జట్టు(Indian Cricket Team) విషయానికి వస్తే , ఈ పని మరింత కష్టంగా మారుతుందని తెలుస్తోంది. టీమిండియా తన విజయాలను స్వదేశంలో పదేపదే చాటుకుంటోంది. ఇటీవల మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శ్రీలంక(Sri Lanka Cricket Team)ను 3-0 తేడాతో ఓడించింది. అంతకుముందు వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌లను భారత్‌ ఓడించింది. ఈ సిరీస్‌తో భారత్ ఎన్నో రికార్డులు సృష్టించడంతో పాటు స్వదేశంలో సుదీర్ఘకాలంగా విజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఇందులో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కూడా తన పేరు మీద రికార్డులు సృష్టించాడు.

టీ20లో భారత్‌కు ఇది వరుసగా 12వ విజయం. ఈ విషయంలో ప్రపంచ రికార్డును సమం చేశాడు. వరుసగా 12 మ్యాచ్‌లు గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక వరుస విజయాలు సాధించిన రికార్డు నెలకొల్పింది. మూడో మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి భారత్ ఈ రికార్డును టచ్ చేసింది. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్, నమీబియా (టీ20 ప్రపంచకప్‌లో అన్నీ), న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక జట్లను భారత్ ఓడించింది. ఈ టీంలన్నీ మూడు టీ20ల సిరీస్‌లో భారత్ చేతిలో ఓడిపోయాయి.

2018-19 నుంచి విజయాలే.. స్వదేశంలో భారత జట్టు వరుసగా సిరీస్‌లను కైవసం చేసుకుంటోంది. 2018-19లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా చివరిసారిగా స్వదేశంలో ఓడిపోయింది. ఆ సమయంలో భారత పర్యటనలో ఆస్ట్రేలియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వదేశంలో భారత్ ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. కాగా, దక్షిణాఫ్రికా మాత్రం టీ20 సిరీస్‌ను భారత్‌ పర్యటనలో డ్రా చేసుకోవడంలో విజయం సాధించింది. 2019-20లో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలుపొందగా, అనంతరం మ్యాచులో భారత్‌ విజయం సాధించింది. సిరీస్‌లో చివరి మ్యాచ్ జరగకపోవడంతో సిరీస్ డ్రాగా ముగిసింది. అయితే దీని తర్వాత స్వదేశంలో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది.

అప్పటి నుంచి భారతదేశం 2019-20లో బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంకలను స్వదేశంలో ఓడించింది, ఆపై గత సంవత్సరం టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి, ఆపై న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకలను ఓడించింది.

మోర్గాన్‌-విలియమ్సన్‌ను వెనక్కు నెట్టిన రోహిత్‌.. మూడో టీ20 మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లను అధిగమించాడు. స్వదేశంలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ ప్రస్తుతం స్వదేశంలో 16 విజయాలు సాధించాడు. మోర్గాన్, విలియమ్సన్ స్వదేశంలో చెరో 15 విజయాలు సాధించారు.

Also Read: IND vs SL: కోహ్లీకే కాదు, శ్రీలంక టీంకు కూడా వెరీ వెరీ స్పెషల్.. మొహాలీ టెస్ట్‌తో చేరనున్న ఆ రికార్డులేంటంటే?

IPL 2022: పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా ఆ ప్లేయర్ ఫిక్స్.. ధావన్‌కు దక్కని ఛాన్స్.. ఎందుకంటే?