Asia CUP 2022, IND vs PAK: పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీమిండియాతో మ్యాచ్‌‌కు కీలక బౌలర్ ఔట్?

ఆగస్టు 28న ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. పాకిస్థాన్ స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది గాయంతో బాధపడుతున్నందున ఆసియా కప్‌పై సందేహం వ్యక్తం చేశాడు.

Asia CUP 2022, IND vs PAK: పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీమిండియాతో మ్యాచ్‌‌కు కీలక బౌలర్ ఔట్?
Ind Vs Pak
Follow us

|

Updated on: Aug 14, 2022 | 6:59 AM

ప్రస్తుతం కేఎల్ రాహుల్ నేతృత్వంలోని టీమ్ ఇండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లినప్పటికీ అందరి చూపు ఆసియా కప్ పైనే ఉంది. ఆగస్టు 28న పాకిస్థాన్‌తో భారత్‌ తొలి మ్యాచ్‌ జరగనుండగా, అందుకు టీమిండియా సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ విషయంలో పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగులుతోంది. పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడటం కష్టంగా మారింది. షాహీన్ అఫ్రిది కొంతకాలం క్రితం గాయపడ్డాడు. దాని కారణంగా అతని ఆటపై సందేహాలు ఉన్నాయి. ఈ కారణంగా అతను శ్రీలంకతో రెండో టెస్టు మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. ఇప్పుడు ఆసియా కప్‌కు ముందు పాకిస్థాన్ నెదర్లాండ్స్‌తో ఆడుతున్నప్పుడు, షహీన్ ఈ సిరీస్‌లో విశ్రాంతి తీసుకోవచ్చని తెలుస్తోంది.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం షాహీన్ అఫ్రిది ఫిట్‌నెస్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చాడు. జట్టు వైద్యుడి పర్యవేక్షణలో ఉండేందుకు షాహీన్ ఆఫ్రిదిని నెదర్లాండ్స్‌కు తీసుకువెళతామని చెప్పాడు. అతను ఫిట్‌గా ఉంటే నెదర్లాండ్స్‌తో కూడా ఆడవచ్చని తెలిపాడు.

ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లు కూడా ఉన్నందున, అందుకు సన్నద్ధమవుతున్నామని, సుదీర్ఘ ప్రణాళికతో దీన్ని ఆలోచిస్తున్నామని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. షాహీన్ ఆఫ్రిది ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకటిగా పరిగణిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్‌లో పాక్ విధ్వంసం..

టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది స్పెల్ టీమ్ ఇండియా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టాడు. ఇందులో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వికెట్లు ఉన్నాయి.

ఈసారి ఆసియా కప్ T20 ఫార్మాట్‌లో జరుగుతుంది. UAEలో ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఆగస్టు 28న రాత్రి 7.30 గంటలకు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.