Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా కీరన్ పోలార్డ్.. రషీద్ ఖాన్కు కూడా సారథ్య బాధ్యతలు
అంతర్జాతీయ క్రికెట్తో పాటు లీగ్ క్రికెట్లో బోలెడు అనుభవం ఉన్న పోలార్డ్ను వదులుకోవడానికి ముంబై ఇష్టపడడం లేదు. ఆటగాడిగా కాకున్నా కనీసం కోచింగ్ స్టాఫ్గా నైనా అతని సేవలు పొందాలని ముంబై టీం మేనేజ్మెంట్ భావిస్తోంది.
IPL2023 ప్రారంభానికి ముందు, ముంబై ఇండియన్స్లో కీలక ప్లేయర్ అయిన కీరన్ పొలార్డ్ షాకింగ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడీ కరేబియన్ క్రికెటర్. అయితే అంతర్జాతీయ క్రికెట్తో పాటు లీగ్ క్రికెట్లో బోలెడు అనుభవం ఉన్న పోలార్డ్ను వదులుకోవడానికి ముంబై ఇష్టపడడం లేదు. ఆటగాడిగా కాకున్నా కనీసం కోచింగ్ స్టాఫ్గా నైనా అతని సేవలు పొందాలని ముంబై టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇందులో భాగంగా యూఏఈ ఐఎల్టీ20 లీగ్లో ముంబై ఎమిరేట్స్ కెప్టెన్సీ పగ్గాలను కీరన్ పొలార్డ్కు అప్పగించింది. అలాగే అఫ్గనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్కు సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఎంఐ కేప్టౌన్కు సారధ్య బాధ్యతలను అప్పగించింది. వీరిద్దరిపై తమకు పూర్తి నమ్మకం ఉందని.. ఆయా లీగ్లలో తమ జట్లను ఉన్నత శిఖరాలకు చేరుస్తారనే నమ్మకం ఉందని ముంబై ఫ్రాంచైజీ వీరిద్దరి నియామకానికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ నాయకుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ముంబై ఫ్రాంఛైజీల కెప్టెన్ల జాబితాలో పొలార్డ్, రషీద్ కూడా చేరడం విశేషం.
ముంబై జట్టుతో ఆటగాడిగానే కాదు రోహిత్ గైర్జాహరీలో కొన్నాళ్ల పాటు కెప్టెన్గానూ వ్యవహరించాడు పోలార్డ్. దీంతో అతని సేవలను గుర్తించిన ముంబై అతనిని ఐపీఎల్లో ముంబై టీం బ్యాటింగ్ కోచ్గా నియమించింది. ఇక ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్కు రషీద్ ఖాన్ వైస్ కెప్టెన్గాగా వ్యవహరించాడు. హార్దిక్ సారథ్యంలోని గుజరాత్ ఏకంగా ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు సౌతాఫ్రికా టీ20 లీగ్లో ముంబై జట్టుకు సారథిగా ఎంపిక కావడం విశేషం.
?????? Leaders of the #OneFamily. ?#MICapeTown #MIEmirates @MIEmirates @MICapeTown @ImRo45 @KieronPollard55 @rashidkhan_19 pic.twitter.com/ngGMQWSrgS
— Mumbai Indians (@mipaltan) December 2, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..