AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: అనవసర గొడవతో భారీ మూల్యం.. రాణా, హృతిక్‌లకు మ్యాచ్‌ ఫీజులో కోత .. సూర్యకుమార్‌కు కూడా ..

IPL 2023లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న నాలుగో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అతని కంటే ముందు ఫాఫ్ డు ప్లెసిస్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యాలకు కూడా జరిమానా పడింది. కాగా ఇదే మ్యాచ్‌లో అనవసరపు గొడవతో భారీ మూల్యం చెల్లించుకున్నారు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్ నితీశ్ రాణా, ముంబై బౌలర్‌ హృతిక్‌ షోకీన్‌.

IPL 2023: అనవసర గొడవతో భారీ మూల్యం.. రాణా, హృతిక్‌లకు మ్యాచ్‌ ఫీజులో కోత .. సూర్యకుమార్‌కు కూడా ..
MI vs KKR
Basha Shek
|

Updated on: Apr 17, 2023 | 11:46 AM

Share

రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్‌ పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనుందుకు టీమండియా స్టార్‌ ప్లేయర్‌కు రూ. 12 లక్షల జరిమానా పడింది. ఆదివారం ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు రోహిత్‌. అతని స్థానంలో సూర్య కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈక్రమంలో స్లో ఓవర్‌ రేటుకు గానూ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు మ్యాచ్ రిఫరీ.  IPL 2023లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న నాలుగో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అతని కంటే ముందు ఫాఫ్ డు ప్లెసిస్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యాలకు కూడా జరిమానా పడింది. కాగా ఇదే మ్యాచ్‌లో అనవసరపు గొడవతో భారీ మూల్యం చెల్లించుకున్నారు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్ నితీశ్ రాణా, ముంబై బౌలర్‌ హృతిక్‌ షోకీన్‌. దేశవాళీ క్రికెట్‌లో ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వీరిద్దరు నిన్నటి మ్యాచ్‌లో వాగ్వాదానికి దిగారు. కోల్‌కతా ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌ తొలి బంతికే షోకీన్‌ బౌలింగ్‌లో రాణా (5) రమణ్‌దీప్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ముంబయి బౌలర్‌ షోకీన్‌, రాణా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా షోకీన్‌పై రాణా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు మ్యాచ్‌ రిఫరీ భావించారు. మైదానంలో అసభ్య పదజాలం ఉపయోగించినందుకు నితీశ్ రాణాకు జరిమానా విధించారు. ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని 2.21 నిబంధనను అతిక్రమించినందుకు గానూ నితీశ్‌ రాణా ఫీజులో 25 శాతం కోత విధించారు. అదే విధంగా ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని 2.5 నిబంధనను ఉల్లంఘించినందుకు హృతిక్‌ షోకీన్‌ మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ మ్యాచ్‌ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేశాడు. అయితే మ్యాచ్‌ మధ్యలో సెంచరీ హీరో వెంకటేశ్‌ అయ్యర్ (104) కాలికి గాయం కావడంతో కాసేపు ఆటకు బ్రేక్‌ పడింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ ముగింపు సమయం కంటే ఎక్కువ సేపు కొనసాగడంతో కెప్టెన్‌ సూర్యకుమార్‌కు భారీ మొత్తంలో జరిమానా పడింది. ఇక 186 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 58 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 43 పరుగులతో రాణించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..