AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Siraj: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ విషయాలు చెప్పాలంటూ సిరాజ్‌ను సంప్రదించిన డ్రైవర్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరోసారి ఫిక్సింగ్ ఉదంతం తెరపైకి వచ్చింది. ఈసారి బుకీలు నేరుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ ను సంప్రదించడం కలకలం రేపింది.

Mohammed Siraj: ఐపీఎల్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ విషయాలు చెప్పాలంటూ సిరాజ్‌ను సంప్రదించిన డ్రైవర్..
Mohammed Siraj
Shaik Madar Saheb
|

Updated on: Apr 19, 2023 | 1:38 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరోసారి ఫిక్సింగ్ ఉదంతం తెరపైకి వచ్చింది. ఈసారి బుకీలు నేరుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ ను సంప్రదించడం కలకలం రేపింది. ఐపీఎల్ బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకోవడంతో ఓ డ్రైవర్ సిరాజ్‌ను సంప్రదించడం.. సిరాజ్ బీసీసీఐకి నేరుగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పిటిఐ ప్రకారం.. డ్రైవర్ సిరాజ్‌కు జట్టులోని అంతర్గత విషయాలు చెబితే భారీ మొత్తంలో డబ్బులిస్తామంటూ ఎర చూపాడు. దీంతోపాటు వాట్సప్ కు మెస్సెజ్ లు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సిరాజ్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అవినీతి నిరోధక విభాగానికి (ఏసీయూ) తెలియజేశాడు. ఈ సమాచారం తర్వాత, BCCI యూనిట్ వేగంగా చర్యలు చేపట్టింది. వెంటనే సిరాజ్ ను సంప్రదించిన డ్రైవర్‌ను అరెస్టు చేసింది. సిరాజ్‌ను సంప్రదించిన వ్యక్తి బుకీ కాదని, హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్ అని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.

బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘సిరాజ్‌ను సంప్రదించిన బుకీ ఎవరూ లేరు. హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్‌, మ్యాచ్‌లపై పందెం కాసేవాడు. అతను బెట్టింగ్‌లో చాలా డబ్బు కోల్పోయాడు, దాని కారణంగా అతను జట్టు గురించి అంతర్గత సమాచారం కోసం సిరాజ్‌ను సంప్రదించాడు. ఈ విషయాన్ని సిరాజ్ వెంటనే తెలియజేశాడు. అని పేర్కొన్నారు. సిరాజ్ ఇచ్చిన సమాచారంతో తక్షణమే చర్యలు తీసుకున్నామని.. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వ్యక్తిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారని బీసీసీఐ అధికారి తెలిపారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు.

గతంలో.. ఐపీఎల్‌లో ఫిక్సింగ్ కేసులో మాజీ ఫాస్ట్ బౌలర్లు ఎస్ శ్రీశాంత్, అకింత్ చవాన్, అజిత్ చండీలా అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురితో పాటు చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) జట్టు మాజీ ప్రిన్సిపాల్ గురునాథ్ మెయ్యప్పన్‌ను కూడా అరెస్టయ్యారు. అప్పటి నుంచి బీసీసీఐ అవినీతి నిరోధక బృందం చాలా అప్రమత్తంగా ఉంది. ప్రతి IPL జట్టులో ఒక ACU అధికారి ఉంటారు. అతను ఆటగాళ్లతో పాటు హోటల్‌లో బస చేస్తాడు. అతను ప్రతి కార్యాచరణను పర్యవేక్షిస్తారు. ప్రతి క్రీడాకారుడు.. ఏమి చేయాలి.. ఏమి చేయకూడదు అనే దానిపై శిక్షణ కూడా ఇస్తారు. ఎవరైనా ఆటగాడు కచ్చితమైన సమాచారం ఇవ్వలేకపోతే, అతనిపై కూడా చర్య తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..