AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Auction: ఓ జట్టులో ఉండాల్సిన ప్లేయర్లు ఎంతమంది.. అసలెంతమంది ఉన్నారు.. ఐపీఎల్ ఫ్రాంచైజీలపై ఓ కన్నేయండి..

IPL 2023 Mini Auction: ప్రతి ఫ్రాంచైజీ జట్టులో గరిష్ట, కనిష్ట సంఖ్యలో ఆటగాళ్లను ఉంచే నియమాన్ని అనుసరించాలి. ఇది కాకుండా, ప్రతి జట్టు 8 మంది విదేశీ క్రికెటర్లను మాత్రమే ఉంచుకోగలదు.

IPL Auction: ఓ జట్టులో ఉండాల్సిన ప్లేయర్లు ఎంతమంది.. అసలెంతమంది ఉన్నారు.. ఐపీఎల్ ఫ్రాంచైజీలపై ఓ కన్నేయండి..
Ipl 2023
Venkata Chari
|

Updated on: Dec 21, 2022 | 10:37 AM

Share

IPL Mini Auction 2023: ఐపీఎల్ 2023 కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 23న నిర్వహించనున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్ కోసం ఆటగాళ్ల వేలం కొచ్చిలో జరగనుంది. షార్ట్‌లిస్ట్ చేసిన 405 మంది ఆటగాళ్లలో, అన్ని ఫ్రాంఛైజీలు 87 స్లాట్‌లకు ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నారు. టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి, ప్రతి ఫ్రాంచైజీ తన జట్టును వీలైనంత వరకు బలోపేతం చేయాలని కోరుకుంటుంది. ఒక ఫ్రాంచైజీ తన IPL జట్టులో గరిష్టంగా, కనిష్ట ఎంత సంఖ్యలో ఆటగాళ్లను కలిగి ఉండవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

జట్టులో కనిష్ట, గరిష్ట సంఖ్యలో ఆటగాళ్లు..

ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక జట్టులో గరిష్టంగా 25 మంది, కనిష్టంగా 18 మంది ఆటగాళ్లు ఉండాలి. ఏ జట్టులోనూ 25 మంది కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు ఉండకూడదు. నిబంధనల ప్రకారం, ఒక IPL జట్టులో గరిష్టంగా 25 మంది భారత ఆటగాళ్లు, కనీసం 17 మంది భారత ఆటగాళ్లు ఉండవచ్చు. అదేవిధంగా, ప్రతి ఫ్రాంచైజీ తన జట్టులో గరిష్టంగా 8 మంది అంతర్జాతీయ ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. కనీసం అంతర్జాతీయ ఆటగాళ్లను జట్టులో ఉంచుకోవాలనే నిబంధన కొన్నిసార్లు వర్తించదు.

ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఇంకెంతమంది ప్లేయర్లు కావాలంటే..

సన్‌రైజ్ హైదరాబాద్..

ఆటగాళ్లను విడుదల చేసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక పర్స్ విలువ రూ.42.25 కోట్లుగా మారింది. మరోవైపు హైదరాబాద్‌లో ప్రస్తుతం 17 మంది ఆటగాళ్లకు స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 13 మంది భారత, 4గురు విదేశీ ఆటగాళ్లను చేర్చుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

పంజాబ్ కింగ్స్..

వేలంలో పంజాబ్ కింగ్స్ పర్స్ ప్రస్తుతం రూ.32.20 కోట్లుగా ఉంది. అదే సమయంలో పంజాబ్‌లో ఇంకా 12 మంది ఆటగాళ్ల స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 9 మంది భారతీయ, 3గురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్ ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్..

ఐపీఎల్ వేలం కోసం లక్నో సూపర్ జెయింట్స్ వద్ద రూ.23.35 కోట్ల పర్స్ ఉంది. ప్రస్తుతం లక్నోలో 14 మంది ఆటగాళ్ల స్లాట్‌ ఖాళీగా ఉంది. ఇందులో 10 మంది భారతీయ, నలుగురు విదేశీ ఆటగాళ్లను చేర్చుకోవచ్చు.

ముంబై ఇండియన్స్..

ఐపీఎల్ ఛాంపియన్ టీమ్ ముంబై ఇండియన్స్ ప్రస్తుతం వేలంలో రూ.20.55 కోట్ల పర్స్ కలిగి ఉంది. ముంబైలో ప్రస్తుతం 12 మంది ఆటగాళ్ల స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 9 మంది భారతీయ, 3 విదేశీ ఆటగాళ్లను చేర్చవచ్చు.

చెన్నై సూపర్ కింగ్స్..

మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఐపీఎల్ వేలం కోసం రూ.20.45 కోట్ల పర్స్ కలిగి ఉంది. చెన్నైలో ప్రస్తుతం 9 మంది ఆటగాళ్ల స్లాట్‌ ఖాళీగా ఉంది. ఇందులో 7 మంది భారతీయ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను చేర్చవచ్చు.

ఢిల్లీ క్యాపిటల్స్..

ఐపీఎల్ మినీ వేలం కోసం ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద ప్రస్తుతం రూ.19.45 కోట్ల పర్స్ ఉంది. అదే సమయంలో, ఢిల్లీలో 7గురు ఆటగాళ్ల స్లాట్స్ ఖాళీగా ఉంది. ఇందులో 5 మంది భారతీయ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను చేర్చవచ్చు.

గుజరాత్ టైటాన్స్..

ఐపీఎల్ 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వేలం కోసం రూ. 19.25 కోట్ల పర్స్ కలిగి ఉంది. ప్రస్తుతం గుజరాత్‌లో 10 మంది ఆటగాళ్ల స్లాట్‌ ఖాళీగా ఉంది. ఇందులో 7 మంది భారతీయ, ముగ్గురు విదేశీ ఆటగాళ్లను చేర్చుకోవచ్చు.

రాజస్థాన్ రాయల్స్..

ప్రస్తుతం ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ పర్స్ విలువ రూ.13.20 కోట్లు. ప్రస్తుతం రాజస్థాన్‌లో 13 మంది ఆటగాళ్ల స్లాట్‌ ఖాళీగా ఉంది. ఇందులో 9 మంది భారతీయ, 4గురు విదేశీ ఆటగాళ్లను చేర్చవచ్చు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..

ప్రస్తుతం ఐపీఎల్ వేలం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్స్ విలువ రూ.8.75 కోట్లు. ప్రస్తుతం బెంగళూరులో 9 మంది ఆటగాళ్ల స్లాట్‌ ఖాళీగా ఉంది. ఇందులో 7 మంది భారత, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను చేర్చవచ్చు.

కోల్‌కతా నైట్ రైడర్స్..

ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ పర్స్ విలువ రూ.7.05 కోట్లు. కోల్‌కతాలో ప్రస్తుతం 14 మంది ఆటగాళ్ల స్లాట్ ఖాళీగా ఉంది. ఇందులో 11 మంది భారత, 3గురు విదేశీ ఆటగాళ్లను చేర్చుకోవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..