IND Vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. 18 మంది ప్లేయర్లకు ఛాన్స్.. భారత జట్టులో వీరికి అవకాశం దక్కేనా?
IND Vs AUS: వచ్చే వారం ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్కు టీమిండియాను ప్రకటించనున్నారు. 18 మంది ఆటగాళ్లు చోటు దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

IND Vs AUS: వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్ కోసం టీమ్ఇండియాను త్వరలో ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. నివేదికల ప్రకారం, జట్టును ఎంపిక చేయడానికి వచ్చే వారం సెలెక్టర్ల సమావేశం జరగనుంది. ఇన్సైడ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం, టీ20 ప్రపంచకప్ సన్నాహాలను దృష్టిలో ఉంచుకుని, సెలెక్టర్లు జట్టులో 18 మంది ఆటగాళ్లకు చోటు కల్పించవచ్చని తెలుస్తోంది.
వచ్చే వారం ప్రారంభంలోనే జట్టును ప్రకటిస్తారని నివేదికలో పేర్కొన్నారు. సెప్టెంబరు 16లోపు అక్టోబర్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్ 2022కు కూడా టీమ్ ఇండియాను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు జట్టులో పెద్దగా మార్పులు వచ్చే సూచనలు కనిపించడం లేదు.
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు, కేఎల్ రాహుల్ మాత్రమే ఓపెనింగ్ బాధ్యతను నిర్వహించడం చూడవచ్చు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో, సూర్యకుమార్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఆల్రౌండర్లుగా జట్టులో ఉంటారు. రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ పాత్రను పోషించనున్నారు.




ఈ ఆటగాళ్లకు కూడా చోటు..
దీపక్ హుడాను బ్యాకప్ ఆల్ రౌండర్గా జట్టులో ఉంచుకోవచ్చు. యుజువేంద్ర చాహల్కు కూడా చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పాటు భువనేశ్వర్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్లకు కూడా ఆస్ట్రేలియాతో సిరీస్లో చోటు దక్కనుంది.
టీమ్ ఇండియా నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావచ్చు. ప్రస్తుతం, జస్ప్రీత్ బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీలో తన ఫిట్నెస్పై పనిచేస్తున్నాడు. అయితే బుమ్రా ఫిట్నెస్తో సెలక్టర్లు రిస్క్ తీసుకోరని, అతను పూర్తిగా ఫిట్గా ఉంటేనే జట్టులో చోటు కల్పిస్తారని తెలుస్తోంది.
ఆర్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్లో టీమ్ఇండియాలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఆటగాళ్లకు ప్లేయింగ్ 11లో చోటు దక్కడం చాలా కష్టంగా మారింది.




