AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2023: మరో ఫైనల్‌లో లంక చిత్తు.. భారత్ ఖాతాలో క్రికెట్ గోల్డ్ మెడల్.. ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న అభినందనలు..

INDW vs SLW, Asian Games Women's T20I 2023 Final: ఆసియా కప్ 2023 టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ 10 వికెట్ల తేడాతో టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగి 10 రోజులు కూడా కాకముందే లంకపై టీమిండియా మరో టైటిల్ మ్యాచ్‌ని నెగ్గింది. చైనాలోని హంగ్‌జౌ వేదికగా జరుగుతున్న అసియా క్రీడల్లో లంకపై భారత మహిళల క్రికెట్ జట్టు బంగారు పతకం..

Asian Games 2023: మరో ఫైనల్‌లో లంక చిత్తు.. భారత్ ఖాతాలో క్రికెట్ గోల్డ్ మెడల్.. ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న అభినందనలు..
INDW vs SLW, Asian Games Women's T20I 2023 Final
శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 25, 2023 | 4:01 PM

Share

INDW vs SLW, Asian Games Women’s T20I 2023 Final: ఆసియా కప్ 2023 టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ 10 వికెట్ల తేడాతో టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగి 10 రోజులు కూడా కాకముందే లంకపై టీమిండియా మరో టైటిల్ మ్యాచ్‌ని నెగ్గింది. చైనాలోని హంగ్‌జౌ వేదికగా జరుగుతున్న అసియా క్రీడల్లో లంకపై భారత మహిళల క్రికెట్ జట్టు బంగారు పతకం గెలిచింది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఏషియన్ గేమ్స్ ఉమెన్స్ టీ20 2023 ఫైనల్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున స్మృతీ మంధాన 46 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ 42 పరుగులు.. టిటాస్ సాధు 3 వికెట్లు సాధించారు.

ఇక అంతకముందు టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ చేసిన భారత్.. 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఇలా 117 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన లంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేయగలిగింది. దీంతో లంకపై భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించి, గోల్డ్ మెడల్‌ని కైవసం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

హర్మన్‌ప్రీత్ కౌర్..

కాగా, ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించడంతో భారత మహిళల జట్టుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, బీసీసీఐ సెక్రటరీ జైషా, టెస్ట్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా, యాక్టర్ సునీల్ శెట్టితో పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ వంటి ఐపీఎల్ జట్లు కూడా ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాయి.

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. ‘అరంగేట్రంలోనే గోల్డ్ మెడల్ సాధించిన భారత మహిళల జట్టుకు అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు.

చారిత్రాత్మకం..

హృదయపూర్వక అభినందనలు..

క్రికెట్‌లో మొదటిది.. 

గర్వంగా ఉంది.. 

మూడుకు మూడు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..