AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi: బుడ్డోడి ఖాతాలో 3 భారీ రికార్డులు.. క్రికెట్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర.?

Vaibhav Sooryavanshi Records: వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత వరుస పరాజయాలతో సతమతమవుతున్న భారత టి20 జట్టుకు ఇది అత్యంత కీలకమైన సిరీస్. గురువారం నుంచి హరారే వేదికగా జింబాబ్వేతో జరగనున్న 3 మ్యాచ్‌ల పోరులో శ్రేయస్ అయ్యర్ సేన తిరిగి పుంజుకోవడమే కాకుండా, సంచలన రికార్డులపై కన్నేసింది. ముఖ్యంగా 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు.

Vaibhav Sooryavanshi: బుడ్డోడి ఖాతాలో 3 భారీ రికార్డులు.. క్రికెట్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర.?
Vaibhav Suryavanshi Records
Venkata Chari
|

Updated on: Jul 23, 2026 | 4:41 PM

Share

Vaibhav Sooryavanshi Records: గత ఏడు టీ20 మ్యాచ్‌లలో ఏకంగా ఆరింటిలో ఓడిపోయిన భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఆడిన చివరి రెండు ద్వైపాక్షిక సిరీస్‌లను కూడా చేజార్చుకోవడంతో, ఈసారి జింబాబ్వేపై గెలిచి తమ ఉనికిని చాటుకోవాలని పట్టుదలగా ఉంది. “గతం గడిచిపోయింది, సరికొత్త ఉత్సాహంతో మైదానంలోకి దిగుతాం” అని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెగేసి చెప్పాడు. గురువారం మధ్యాహ్నం 4:30 గంటలకు ప్రారంభమైన తొలి పోరులో ఆధిపత్యం ప్రదర్శించాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ సిరీస్‌లో మ్యాచ్‌ల ఫలితాల కంటే కూడా మూడు అరుదైన మైలురాళ్లు క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈక్రమంలో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

షాహిద్ అఫ్రిది శతాబ్దాల నాటి రికార్డుకు ముప్పు..!

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్కుడిగా సెంచరీ బాదిన ఘనత ఇప్పటికీ పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది (16 ఏళ్ల 217 రోజులు) పేరుమీదే ఉంది. అయితే వచ్చే ఏడాది మార్చి వరకు 16 ఏళ్లు కూడా నిండని భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి ఈ రికార్డును చెరిపేసేందుకు సువర్ణావకాశం లభించింది. జింబాబ్వేపై ఒకే ఒక్క శతాబ్దం సాధించినా, ప్రపంచ క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్కుడైన సెంచరీ వీరుడిగా వైభవ్ చరిత్ర పుటల్లోకి ఎక్కుతాడు.

ప్రమాదంలో రోహిత్ శర్మ రికార్డు.. టాప్ స్కోరర్‌గా అభిషేక్?

మరోవైపు, భారత్ తరపున టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ (35 బంతుల్లో) చేసిన రోహిత్ శర్మ రికార్డును కూడా వైభవ్ అధిగమించే అవకాశం ఉంది. ఐపీఎల్‌లోనే కేవలం 35 బంతుల్లో సెంచరీ బాది విశ్వరూపం చూపించిన ఈ కుర్రాడి విధ్వంసకర బ్యాటింగ్‌పై అందరి దృష్టి నెలకొంది. ఇక మూడో రికార్డు విషయానికి వస్తే, భారత్-జింబాబ్వే టి20 సమరాల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రస్తుతం సీనియర్ ఆటగాడు సికందర్ రజా (194 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి కంటే కేవలం 15 పరుగుల వెనుకంజలో ఉన్న భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (179 పరుగులు), ఈ సిరీస్‌లోనే రజాను దాటేసి సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకునేందుకు సిద్దమయ్యాడు.

వరుస ఓటములతో సతమతమవుతున్న భారత్‌కు ఈ సిరీస్ విజయం ఎంతో అత్యవసరం. అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు ఈ మూడు రికార్డులను తిరగరాసి భారత క్రికెట్ భవిష్యత్తుపై ధీమాను పెంచుతారో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us