AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: సెంచరీ ఇన్నింగ్స్‌తో అగ్రస్థానంలోకి విరాట్ కోహ్లీ.. బద్దలైన సచిన్, రిచర్డ్స్ రికార్డులు..

Virat Kohli Record: ప్రత్యర్థి జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు.

IND vs SL: సెంచరీ ఇన్నింగ్స్‌తో అగ్రస్థానంలోకి విరాట్ కోహ్లీ.. బద్దలైన సచిన్, రిచర్డ్స్ రికార్డులు..
Virat Kohli
Venkata Chari
|

Updated on: Jan 16, 2023 | 3:46 PM

Share

భారత్-శ్రీలంక మధ్య జరిగిన మూడో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతం చేశాడు. తిరువనంతపురంలో జరిగిన చివరి మ్యాచ్‌లో 166 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో వన్డే క్రికెట్‌లో 46వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. గత మ్యాచ్‌లో టీమిండియా 317 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. వన్డే చరిత్రలో పరుగుల పరంగా ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయంగా నిలిచింది. తన చారిత్రాత్మక ఇన్నింగ్స్ కారణంగా, విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్, వివియన్ రిచర్డ్స్ వంటి బ్యాట్స్‌మెన్ల వన్డే రికార్డులను బ్రేక్ చేశాడు. ప్రత్యర్థి జట్టుపై వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ నిలిచాడు.

సచిన్ – రిచర్డ్స్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ..

ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించిన మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. జనవరి 15న శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్, వివియన్ రిచర్డ్స్ రికార్డులను బద్దలు కొట్టాడు. శ్రీలంకపై విరాట్ కోహ్లీ అత్యధికంగా 2992 పరుగులు చేశాడు. ఈ విషయంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 2వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాపై విజయంలో 2950 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌కు చెందిన సర్ వివియన్ రిచర్డ్స్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌పై రిచర్డ్స్ విజయంలో 2950 పరుగులు చేయగలిగాడు.

46వ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ..

ఇవి కూడా చదవండి

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి తన వన్డే కెరీర్‌లో 46వ సెంచరీని సాధించాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ప్రపంచంలో రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. కాగా, వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన వన్డే కెరీర్‌లో 49 సెంచరీలు సాధించాడు. వన్డేల్లో సచిన్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టేందుకు విరాట్ కేవలం నాలుగు అడుగుల దూరంలోనే ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తదుపరి వన్డే సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. ఇది జనవరి 18 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లోనూ విరాట్‌ సత్తా చాటేందుక సిద్ధమయ్యాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..