IND vs SL: ముగిసిన టీ20 సిరీస్.. వన్డే సమరానికి సిద్ధమైన భారత్, శ్రీలంక జట్లు.. పూర్తి షెడ్యూల్ ఎలా ఉందంటే?
India vs Sri Lanka ODI Series: భారత్-శ్రీలంక మధ్య ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మొత్తం మూడు మ్యాచ్లు జరుగుతుండగా, కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం ఈ మ్యాచ్లన్నింటికీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సిరీస్ ద్వారా టీమిండియా దిగ్గజాలు పునరాగమనం చేయడం విశేషం. పూర్తి షెడ్యూల్ ఎలా ఉందో ఓసారి చూద్దాం..
India vs Sri Lanka: శ్రీలంకతో టీ20 సిరీస్ ముగిసింది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్లో 43 పరుగుల తేడాతో గెలుపొందిన భారత జట్టు రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్లో సూపర్ ఓవర్లో టీమిండియా విజయం సాధించింది. దీంతో సిరీస్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది.
ఇప్పుడు ఆగస్ట్ 2 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్కు భారత జట్టు సిద్ధమైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేయనున్నారు. అంటే, టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా దిగ్గజాలు ఇద్దరు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు లంకతో వన్డే సిరీస్ ద్వారా మళ్లీ మైదానంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత భారత జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ కూడా ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేయడం విశేషం. దీని ప్రకారం ఈ సిరీస్ పూర్తి షెడ్యూల్ ఎలా ఉందో ఓసారి చూద్దాం..
భారత్-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూల్:
మొదటి ODI: ఆగస్టు 2 (కొలంబో) – 2.30 PM IST
రెండవ ODI: ఆగస్టు 4 (కొలంబో) – 2.30 PM IST
మూడవ ODI: ఆగస్ట్ 7 (కొలంబో) – 2.30 PM IST
రెండు జట్లు:
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, ర్యాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
శ్రీలంక వన్డే జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జెనిత్ లియాంగే, నిషాన్ మధుశంక, వనిందు హసరంగా, దునిత్ వెల్లగే, చమిక కరుణారత్న, డి. మహిష్ థినంజయ, డి. మతిష పతిరనా, అసిత ఫెర్నాండో.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..