AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: పాకిస్తాన్ టీంతో మ్యాచ్.. వివాదంలో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు..

IND vs PAK: గత సంవత్సరం పహల్గామ్ దాడి భారత్, పాకిస్తాన్ దేశాల వివాదం మరింత ముదిరింది. ఈ వివాదంతో రెండు దేశాల క్రికెట్ సంబంధాలను మరింత ప్రభావితం చేసింది. ఆసియా కప్ సమయంలో భారత జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించింది. దీంతో ఈ ఇష్యూ ప్రస్తుతం కంటిన్యూ అవుతోంది.

IND vs PAK: పాకిస్తాన్ టీంతో మ్యాచ్.. వివాదంలో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు..
Irfan Pathan, Stuart Binny
Venkata Chari
|

Updated on: Jan 23, 2026 | 12:16 PM

Share

IND vs PAK: గత ఏడాది కాలంగా భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎంతగా దిగజారాయో తెలిసిందే. రాజకీయ, సైనిక సంఘర్షణ క్రీడలను కూడా ప్రభావితం చేసింది. ఈ మేరకు ఐసీసీ లేదా ఏసీసీ టోర్నమెంట్లలో ఆడుతున్నాయి. అయితే, ఈ రెండు జట్ల మధ్య “నో హ్యాండ్‌షేక్‌” వివాదం కొనసాగుతోంది. వీటన్నిటి మధ్య భారత మాజీ ఆల్ రౌండర్లు ఇర్ఫాన్ పఠాన్, స్టూవర్ట్ బిన్నీ ఒక మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేసి, కౌగిలించుకోవడంతో వివాదం చెలరేగింది.

పాకిస్తాన్ చేతిలో తొలి ఓటమి..

సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ప్రపంచ క్రికెట్ ఉత్సవంలో, భారత వర్సెస్ పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లతో కూడిన జట్లు పాల్గొన్నాయి. జనవరి 22వ తేదీ గురువారం భారత్, పాకిస్తాన్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, షోయబ్ మాలిక్, ఇమ్రాన్ నజీర్ ల తుఫాన్ బ్యాటింగ్ కారణంగా 4 ఓవర్లలో 56 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

దీనికి ప్రతిస్పందనగా, భారత కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్, స్టూవర్ట్ బిన్నీ బ్యాటింగ్‌కు దిగారు. కానీ, వీరిద్దరు నాలుగు ఓవర్లలో 51 పరుగులు మాత్రమే చేయగలిగారు. పఠాన్ ఒక్కడే 49 పరుగులు చేశాడు. బిన్నీ తన ఖాతా తెరవలేకపోయాడు. అందువలన పాకిస్తాన్ ఐదు పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత జరిగినది మ్యాచ్ ఫలితం కంటే ఎక్కువ దృష్టిని ఆకర్షించింది.

మ్యాచ్ ముగిసిన వెంటనే ఇర్ఫాన్ పఠాన్, బిన్నీ షోయబ్ మాలిక్ తో కరచాలనం చేసి అతనిని కౌగిలించుకున్నారు. ఆ తర్వాత, భారత, పాకిస్తాన్ జట్ల ఆటగాళ్లందరూ కరచాలనం చేసుకున్నారు. ఇది చాలా సంవత్సరాలుగా ఆచారం. అయితే గత సంవత్సరం జరిగిన ఈవెంట్ల తర్వాత భారత, పాకిస్తాన్ ఆటగాళ్ళు కరచాలనం చేయడం ఇదే మొదటిసారి. దీని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాకిస్తాన్ వినియోగదారులు ఇర్ఫాన్ ను ట్రోల్ చేశారు.

ఆసియా కప్ తో మొదలైన ట్రెండ్..

నిజానికి, గత ఏడాది ఏప్రిల్‌లో పహల్గామ్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి, ఆ తర్వాత మే నెలలో జరిగిన భారత్-పాకిస్తాన్ సైనిక వివాదం ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలను మరింత దిగజార్చాయి. ఈ ప్రభావం రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌లపై కూడా పడింది. సైనిక వివాదం జరిగిన కొన్ని వారాల తర్వాత, ఇంగ్లాండ్‌లో జరిగిన మాజీ ఆటగాళ్ల టోర్నమెంట్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ వంటి మాజీ భారత ఆటగాళ్ళు ఈ మ్యాచ్‌లో పాల్గొన్నందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొని, ఆ తర్వాత మ్యాచ్‌ను బహిష్కరించారు.

తదనంతరం, ఆసియా కప్ టీ20లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. కానీ ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయి. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా మొత్తం జట్టు టాస్ సమయంతోపాటు మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించింది. టోర్నమెంట్‌లోని మూడు మ్యాచ్‌లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత, మహిళల ప్రపంచ కప్‌లో, భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో క్రీడాకారులు కరచాలనం చేయడానికి నిరాకరించారు. అయితే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో కూడా ఇలాంటి సంఘటనలు కనిపించాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..