AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Babu: అంత కష్టపడి సినిమా తీస్తే నిర్మాత మోసంతో ఎవరినీ నమ్మలేకపోతున్నా.. నటుడు రవిబాబు ..

దర్శకుడు రవిబాబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. సెట్‌లో తన ప్రవర్తన, అలాగే లడ్డు బాబు సినిమా నిర్మాత పారితోషికం విషయంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సెట్‌లో 100% నిమగ్నతతో పనిచేస్తానని, అదే అంకితభావం బృందం నుంచి ఆశిస్తానని ఆయన తెలిపారు. తాను అంచనా వేసిన స్థాయిలో పని జరగనప్పుడు కోపం వస్తుందని, అప్పుడప్పుడు సాధారణ మాటలు వస్తాయని, అయితే అవి ఎవరినీ బాధపెట్టేవిగా ఉండవని చెప్పుకొచ్చారు.

Ravi Babu: అంత కష్టపడి సినిమా తీస్తే నిర్మాత మోసంతో ఎవరినీ నమ్మలేకపోతున్నా.. నటుడు రవిబాబు ..
Ravi Babu
Rajitha Chanti
|

Updated on: Jan 23, 2026 | 11:17 AM

Share

ప్రముఖ దర్శకుడు రవిబాబు తన కెరీర్‌లోని కొన్ని ఆసక్తికర విషయాలను, చేదు అనుభవాలను పంచుకున్నారు. సెట్‌లో తన ప్రవర్తన, వృత్తిపట్ల తనకున్న నిబద్ధత, అలాగే లడ్డు బాబు సినిమా నిర్మాత చేసిన ఆర్థిక మోసం గురించి ఆయన వివరించారు. సెట్‌లో తాను అడుగుపెట్టగానే తనలోకి ఏదో పరకాయ ప్రవేశం చేసినట్లు ఉంటుందని, తన దృష్టి మొత్తం షాట్ మీదే ఉంటుందని రవిబాబు తెలిపారు. తన క్యారెక్టర్ ఫ్లో ఏమిటంటే 100% నిమగ్నతతో పనిచేయడం, అదే అంకితభావాన్ని బృంద సభ్యుల నుంచి ఆశించడం అని చెప్పారు. అయితే, అందరూ తన స్థాయి అంకితభావం చూపించలేరని అన్నారు. తాను ఆశించిన విధంగా పని జరగనప్పుడు కోపం వస్తుందని, అప్పుడప్పుడు మాటలు వస్తాయని, అయితే అవి ఎవరి కుటుంబాలను గానీ, వ్యక్తులను గానీ అవమానించేవిగా ఉండవని, కేవలం క్యాజువల్ మాటలేనని స్పష్టం చేశారు.

తన కెరీర్‌లో అత్యంత బాధ కలిగించిన సంఘటనగా లడ్డు బాబు సినిమా నిర్మాత చేసిన మోసాన్ని రవిబాబు వెల్లడించారు. ఏ సినిమా చేసినా, అది తన సినిమా అయినా, ఇతరుల సినిమా అయినా 100% కృషి చేస్తానని ఆయన చెప్పారు. దాదాపు 14 నెలలు లడ్డు బాబు సినిమా కోసం కష్టపడి పనిచేసిన తర్వాత, నిర్మాత తన పారితోషికంలో 80% చెల్లించకుండా మోసం చేశాడని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా నిర్మాణానికి డబ్బుల కొరత రాకూడదని భావించి, పారితోషికం చివరగా తీసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అయితే, సినిమా విడుదల రోజుకు ముందు రాత్రి, నిర్మాత డబ్బులు లేవని చెప్పి, ఒక ప్రభుత్వ భూమి పత్రాన్ని పారితోషికం కింద సంతకం చేసి ఇచ్చాడని, మరుసటి రోజు అది ప్రభుత్వ భూమి అని తెలిసి తాను నిర్ఘాంతపోయానని వివరించారు. ఆ తర్వాత నిర్మాత ఇచ్చిన చెక్కులు కూడా ఎన్ కాష్ కాలేదని, వాటి గడువు ముగిసిపోకుండా ఉండటానికి చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసు వేయాల్సి వచ్చిందని రవిబాబు వివరించారు.

ఈ చేదు అనుభవం నుంచి “ఎవరినీ నమ్మొద్దు” అనే గుణపాఠం నేర్చుకున్నానని రవిబాబు తెలిపారు. అయితే, నమ్మకం లేకుండా పనిచేయలేమని, భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారని గుర్తుంచుకుని, మరింత జాగ్రత్తగా ఉండాలని, ముందుగానే పారితోషికం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆడియో ఫంక్షన్లు, ప్రెస్ మీట్‌లకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అవి చాలా బోరింగ్‌గా అనిపిస్తాయని, అందుకే వాటికి హాజరుకావడం తగ్గించానని రవిబాబు అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Director Krishnavamsi : ఖడ్గం సినిమాలో ఆమె పాత్ర నిజమే.. ఆ సీన్ ఎందుకు చేశామంటే.. డైరెక్టర్ కృష్ణవంశీ..