AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram : ఆ పాట విని ఆశ్చర్యపోయా.. తెలుగు డిక్షనరీ కొని మరీ అర్థం వెతికాను.. త్రివిక్రమ్ శ్రీనివాస్..

త్రివిక్రమ్ శ్రీనివాస్, సీతారామశాస్త్రి కవిత్వం తెలుగు పాటలకు కొత్త ఆయూషనిచ్చిందని ప్రశంసించారు. ఆయన పాటలు ప్రేక్షకులను అర్థం చేసుకోవాలనే తపనను కలిగించాయని, వాణిజ్య సినిమా పరిమితుల్లోనూ ఉన్నత స్థాయి సాహిత్యాన్ని సృష్టించారని వివరించారు. కవిత్వ శక్తిని, సాహిత్య విలువలను ఆయన చాటిచెప్పారని త్రివిక్రమ్ పేర్కొన్నారు.

Trivikram : ఆ పాట విని ఆశ్చర్యపోయా.. తెలుగు డిక్షనరీ కొని మరీ అర్థం వెతికాను.. త్రివిక్రమ్ శ్రీనివాస్..
Trivikram Srinivas
Rajitha Chanti
|

Updated on: Jan 23, 2026 | 12:46 PM

Share

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్య ప్రతిభపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సీతారామశాస్త్రి రాసిన ప్రాగ్దిశ వేణియపైన పాట విన్న తర్వాతే తాను తెలుగు నిఘంటువు “శబ్దరత్నాకరం” గురించి తెలుసుకున్నానని త్రివిక్రమ్ వెల్లడించారు. పాట కేవలం అర్థమయ్యేలా రాయడమే కాకుండా, అర్థం చేసుకోవాలనే తపనను పుట్టించేలా కూడా రాయవచ్చని సిరివెన్నెల నిరూపించారని ఆయన పేర్కొన్నారు. అలాగే “తరలి రాద తనే వసంతం”, “బలపం పట్టి భామ బళ్లో” వంటి పాటలలో వాణిజ్య సినిమా పరిమితుల మధ్య కూడా సీతారామశాస్త్రి ఎంతటి ఉన్నతమైన కవిత్వాన్ని పొందుపరిచారని త్రివిక్రమ్ అన్నారు. హీరో ఇమేజ్, దర్శకుల అవగాహనారాహిత్యం, నిర్మాతల వ్యాపార విలువలు వంటి సవాళ్ల మధ్య కూడా ఆయన గొప్ప పాటలు సృష్టించారని ప్రశంసించారు. రాత్రులు జాగారం చేసి, తన వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేసి సిరివెన్నెల సాహిత్య సృష్టికి కృషి చేశారని త్రివిక్రమ్ తెలిపారు. సినిమా పాటలకు సాహిత్య విలువ లేదనే అపనమ్మకం ఉన్నప్పటికీ, సిరివెన్నెల వంటి కవులు తెలుగు సినిమా స్థాయిని పెంచారని అన్నారు.

సీతారామశాస్త్రి కవిత్వాన్ని వర్ణించడానికి తనకున్న పదజాలం, శక్తి సరిపోవని త్రివిక్రమ్ వినయంగా అంగీకరించారు. సిరివెన్నెల రాసిన “ప్రాగ్దిశ వేణియపైన దినకర మయూఖ తంత్రులపైన…” అనే పాట విన్న తర్వాతే తాను తెలుగు డిక్షనరీ “శబ్దరత్నాకరం” గురించి తెలుసుకుని, దానిని కొనుగోలు చేసి పదాల అర్థాలను వెతుక్కున్నానని త్రివిక్రమ్ గుర్తుచేసుకున్నారు. పాట అంటే కేవలం సులువుగా అర్థమయ్యేలా రాయడం మాత్రమే కాదని, లోతైన అర్థాలను తెలుసుకోవాలనే ఆసక్తిని, తపనను ప్రేక్షకులలో కలిగించేలా కూడా రాయవచ్చని సీతారామశాస్త్రి నిరూపించారని త్రివిక్రమ్ ప్రశంసించారు. భీమవరం వంటి చిన్న ఊరిలో, ఒక చిన్న గ్రంథాలయంలో 16 ఏళ్ల కుర్రాడు నిఘంటువును వెతికి, ఒక పదానికి అర్థం తెలుసుకొని ఆ రోజు రాత్రి ఆ ఎక్సైట్మెంట్‌తో పడుకుంటాడని, అలాంటి తపనను కలిగించే కవి సీతారామశాస్త్రి అని త్రివిక్రమ్ వివరించారు.

చిరంజీవి సినిమాలో “తరలి రాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం” వంటి మాటలను రాయడానికి, వాటిని దర్శకుడు, నిర్మాతతో సినిమాలో పెట్టించడానికి ఎంత ధైర్యం కావాలో ఒక దర్శకుడిగా తనకు తెలుసని త్రివిక్రమ్ వెల్లడించారు. అలాగే వెంకటేష్, దివ్యభారతి మధ్య డ్యూయట్ పాట “బలపం పట్టి భామ బళ్లో” లోని “కొమ్మల్లో కుహూలు, కొండల్లో ఎకోలు” వంటి వాక్యాలు సర్రియలిస్టిక్ కవిత్వాన్ని చూపిస్తాయని, ఇరుకు ప్రదేశంలో అలాంటి సాహిత్యాన్ని సృష్టించడం ఎంత కష్టమో త్రివిక్రమ్ వివరించారు. హీరోల తాలూకు ఇమేజ్, దర్శకుల అవగాహన, నిర్మాతల వ్యాపార విలువలు, ప్రేక్షకులకు అర్థం చేసుకోలేనితనం వంటి సవాళ్ల మధ్య కూడా ఒక గొప్ప పాటను అందించడానికి సీతారామశాస్త్రి ఎంతో శ్రమించారని ఆయన అన్నారు. రాత్రిళ్ళు మేల్కొని, తన జీవితాన్ని, కుటుంబ సమయాన్ని త్యాగం చేసి, పదాలు అనే కిరణాలతో, అక్షరాలు అనే తూటాలతో ఆయన ప్రపంచం మీద వేటాడుతారని త్రివిక్రమ్ సీతారామశాస్త్రి ని రాత్రి ఉదయించే సూర్యుడు గా అభివర్ణించారు.

సింధూరం సినిమా చివర్లో “అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వాతంత్ర్యం అందామా?” అనే ఒక్క మాటతో తాను ఎంతగా ప్రభావితుడయ్యాడో త్రివిక్రమ్ వివరించారు. సాహిత్యానికి, అక్షరానికి మాత్రమే మనుషులను ఇంతలా కదిలించగలిగే శక్తి ఉంటుందని ఆయన అన్నారు. మల్లాది రామకృష్ణశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి వంటి గొప్ప కవులు తెలుగు సినిమాకు పాటలు రాయడం వల్ల వారి గొప్ప సాహిత్యం సరిగా గుర్తించబడలేదని, సిరివెన్నెల కూడా అదే కోవలోకి వస్తారని త్రివిక్రమ్ బాధపడ్డారు. తెలుగు సినిమాకు పాటలు రాయడం వారి దురదృష్టం అయినప్పటికీ, అలాంటి గొప్ప కవిత్వాన్ని వినే అదృష్టం మనకు దక్కిందని త్రివిక్రమ్ అన్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Actress : హీరోయినే అసలు విలన్.. కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..

Follow Us