AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజకీయాల కంటే ఘోరంగా పీఠం పోరు.. మాఘ్ మేళాలో రచ్చ రచ్చ

రాజకీయాల కంటే ఘోరంగా పీఠం పోరు.. మాఘ్ మేళాలో రచ్చ రచ్చ

Phani CH
|

Updated on: Jan 22, 2026 | 9:18 PM

Share

ప్రయాగ్‌రాజ్ మాఘమేళాలో స్వామి అవిముక్తేశ్వరానంద శంకరాచార్య హోదాపై యూపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంతో వివాదం రాజుకుంది. పుణ్యస్నానానికి ఆయన్ను అడ్డుకోవడంతో నిరసన దీక్షకు దిగారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారని కాంగ్రెస్, ఎస్పీ నేతలు యోగి సర్కార్‌పై మండిపడ్డారు. ఇది రాజకీయ రచ్చకు దారి తీసింది.

ప్రయాగ్‌రాజ్ మాఘమేళాలో స్వామి అవిముక్తేశ్వరానంద శంకరాచార్య హోదాపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై తీవ్ర వివాదం రాజుకుంది. మాఘమేళా అథారిటీ జారీ చేసిన నోటీసుల్లో అవిముక్తేశ్వరానంద శంకరాచార్య కాదని, సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ శంకరాచార్య పేరును వాడుకుంటున్నారని పేర్కొన్నారు. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కోరారు. ఈ నోటీసులపై స్వామి అవిముక్తేశ్వరానంద ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది సనాతన ధర్మాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. ఆదివారం మౌని అమావాస్య నాడు పుణ్యస్నానం చేయడానికి వెళ్తుండగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో ఆయన అనుచరులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కర్తవ్యం కానిస్టేబుల్ కు.. ఏపీ హోం మంత్రి ఆత్మీయ సత్కారం

ఒకే చోట పూజ.. నమాజ్ ! సుప్రీం సంచలన తీర్పు

ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు

మొక్కులో వింత.. భక్తుల్లో మంట !! తప్పు ఒప్పుకున్న టీనా శ్రావ్య

టోల్‌ బకాయిలుంటే వాహన సేవలు బంద్‌