AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs ENG: టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కోహ్లీ బాటలోనే జడేజా.. మిగతా టెస్టులకు కూడా..

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓడిన టీమిండియాకు ఇప్పుడు స్టార్ ఆటగాళ్ల గాయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సిరీస్ ప్రారంభానికి ముందు, అనుభవజ్ఞుడైన పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. అతనితో పాటు వెటరన్ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ కూడా తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగాడు

IND Vs ENG: టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కోహ్లీ బాటలోనే జడేజా.. మిగతా టెస్టులకు కూడా..
Team India
Basha Shek
|

Updated on: Feb 01, 2024 | 7:53 PM

Share

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓడిన టీమిండియాకు ఇప్పుడు స్టార్ ఆటగాళ్ల గాయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సిరీస్ ప్రారంభానికి ముందు, అనుభవజ్ఞుడైన పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. అతనితో పాటు వెటరన్ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ కూడా తొలి రెండు టెస్టుల నుంచి వైదొలిగాడు. వీరిద్దరూ అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్‌ టెస్టులో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో అద్బుతంగా ఆడిన కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రెండో టెస్టు మ్యాచ్‌కు గాయం కారణంగా తప్పుకున్నారు. అయితే గాయం నుంచి కోలుకునేందుకు ఎన్‌సీఏ బెంగళూరులో చేరిన జడేజా మూడో టెస్టుకు కూడా దూరం కావడం ఖాయమని చెబుతున్నారు. అతనితో పాటు విరాట్ కోహ్లి (విరాట్ కోహ్లి) కూడా మూడో టెస్టు ఆడటంపై అనుమానాలు ఉన్నాయి.

4 నుంచి 8 వారాలు..

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టుకు మూడో టెస్టుకు చాలా గ్యాప్‌ ఉంది. అందుకే మూడో టెస్టు నాటికి రాహుల్, జడేజా, కోహ్లిలు జట్టులోకి వస్తారని బీసీసీఐ భావించింది. కానీ ఇప్పుడు క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, రవీంద్ర జడేజా గాయం నయం కావడానికి 4 నుండి 8 వారాలు పడుతుందని తెలసిఇంది . అంటే జడేజా రెండో టెస్టుతో పాటు మూడో టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని తర్వాత ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో జరిగే నాలుగో టెస్టుకు జడేజా ఫిట్‌గా ఉంటాడని భావిస్తున్నారు. ప్రస్తుతం బీసీసీఐ ఇచ్చిన అప్‌డేట్‌లో రవీంద్ర జడేజా రెండో టెస్టుకు మాత్రమే దూరమైనట్లు సమాచారం. ఇక విరాట్ కోహ్లీ గురించి ఇంకా ఎటువంటి అప్‌డేట్ లేదు.

ఇవి కూడా చదవండి

విరాట్ పై నో క్లారిటీ..

వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. అతని అందుబాటులో లేకపోవడంపై బీసీసీఐ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ మొదటి రెండు టెస్టులు ఆడడం లేదని మాత్రమే తెలిపింది. అలాగే మూడో మ్యాచ్‌లో విరాట్ ఆడతాడా లేదా అనే విషయంపై ఇంకా సమాచారం లేదు. ఆ మధ్య విరాట్ తల్లికి ఆరోగ్యం బాగోలేదని పుకార్లు వచ్చాయి. అయితే ఈ పుకార్లను కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ కొట్టిపారేశాడు.

కష్టాల్లో టీం ఇండియా

మొత్తానికి ప్రస్తుతం టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ కూడా విశాఖపట్నం టెస్టుకు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం నుంచి జరగనున్న మ్యాచ్‌లో యువ ఆటగాళ్ల బలంతో ఆ జట్టు పోటీపడనుంది. జట్టు బాధ్యత యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ వంటి యువ ఆటగాళ్లపై ఉంది. అయితే రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రాల అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. కానీ హైదరాబాద్ టెస్టులో ఓటమి తర్వాత వైజాగ్ టెస్టులో మళ్లీ విన్నింగ్ ట్రాక్‌లోకి రావాలనే ఒత్తిడిలో టీమిండియా ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..