WTC Final 2023: ‘టెస్ట్ ఫైనల్’కు వర్షం ముప్పు.. మ్యాచ్ డ్రా అయితే విజేత ఎవరు..? రిజర్వ్ డే ఎలా ఉపయోగపడుతుంది..?
WTC Final 2023: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండో ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్లోని ఓవల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. తొలి ఎడిషన్లోనూ భారత జట్టు ఫైనల్కు చేరినా న్యూజిలాండ్పై విజయం సాధించలేకపోయింది. ఈసారి ఆ లోటును పూడ్చాలని..
WTC Final 2023: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండో ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్లోని ఓవల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. తొలి ఎడిషన్లోనూ భారత జట్టు ఫైనల్కు చేరినా న్యూజిలాండ్పై విజయం సాధించలేకపోయింది. ఈసారి ఆ లోటును పూడ్చాలని, 2013 నుంచి ఐసీసీ ట్రోఫీని గెల్చుకోవాలనే కోరికను నేరవేర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే మ్యాచ్ లండన్ వేదికగా జరుగుతున్నందున వర్షం అంతరాయంగా మారే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే ఫలితం ఎలా ఉంటుందన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ మెదులుతోంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కి కూడా వర్షం ఏ విధంగా అడ్డుపడిందో మనందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఫైనల్ మ్యాచ్కి వర్షం అడ్డంకిగా మారడం క్రికెట్ అభిమానులకు ఇష్టం కలిగించని విషయం అని చెప్పుకోవాలి.
వర్షం పడితే మ్యాచ్ పరిస్ధితి ఏంటి..?
Preparations, adapting to the conditions and getting into the #WTC23 Final groove ?
ఇంగ్లాండ్లోని లండన్ వేదికగా జరిగే ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం ఉంది. వరల్డ్ వెదర్లైన్ ప్రకారం జూన్ 7-11 మధ్య నిరంతర వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొదటి 3 రోజులలో అంటే జూన్ 7 నుంచి 9 వరకు తేలికపాటి వర్షాలు, అలాగే జూన్ 10 నుంచి 11 వరకు వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. అయితే డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్కి జూన్ 12 రిజర్వ్ డేగా ఉంది. ఈ పరిస్థితిలో మ్యాచ్ కొంత వరకు జరిగినా రిజర్వ్ డే రోజు అయినా ఫలితం వెలువడే అవకాశం ఉంటుంది.
Virat Kohli’s work ethic allows him to remain one of the most prized scalps in Test cricket.
కానీ రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ ఫలితం రాకపోతే భారత్-ఆస్ట్రేలియా జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. అంటే భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండూ కూడా టెస్ట్ చాంపియన్షిప్ విజేతలుగా నిలుస్తాయి. రెండు జట్లూ జాయింట్ విన్నర్స్గా మారితే, ఇక్కడ ప్రైజ్ మనీ ఏమవుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. ముందుగా ప్రకటించినట్లుగా అయితే టోర్నీ విజేతకు రూ. 13.22 కోట్ల రూపాయలను, రన్నరప్గా నిలిచిన జట్టుకు రూ. 6.61 కోట్లు ప్రైజ్ మనీగా అందుతుంది. మరి ఈ పరిస్థితుల్లో మ్యాచ్ డ్రాగా ముగిసి ఇరు జట్లు విజేతలుగా నిలిస్తే.. విన్నర్ ప్రైజ్ మనీ నుంచి చెరో సగం అంటే రూ. 6.61 కోట్లు అందుతుంది.
? A red-hot opener
☝️ The leader of the pace attack
? A pair of batting stalwarts
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐసీసీ డబ్య్లూటీఎల్ ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే ఆప్షన్ ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయంలో పూర్తికానప్పుడు రిజర్వ్ డే ఉపయోగపడుతుంది. నిర్ణీత ఐదు రోజుల్లో ఆట నిర్ణీత సమయం కంటే తక్కువగా జరిగి ఫలితం రాకపోయినా కూడా రిజర్వ్ డేని ఉపయోగించవచ్చు. మ్యాచ్ ఫలితం నిర్ణీత ఐదు రోజుల్లో వస్తే, అప్పుడు రిజర్వ్ డే అవసరం ఉండదు. మ్యాచ్ జరిగే ప్రతి రోజు నిర్ణీత ఓవర్ల కంటే తక్కువ ఆడితే మాత్రమే రిజర్వ్ డేలో మ్యాచ్ ఆడతారు. అసలు రిజర్వ్ డేని ఉపయోగించాలా వద్దా అనేది మ్యాచ్ రిఫరీ నిర్ణయిస్తారు.