AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI: బీసీసీఐ దెబ్బకు.. తలవంచిన ఐసీసీ.. ఆ నిర్ణయాన్ని మార్చేస్తూ కీలక ప్రకటన..

ICC vs BCCI: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే మైదానంలోని పిచ్‌పై బీసీసీఐ భారీ విజయాన్ని అందుకుంది.

BCCI: బీసీసీఐ దెబ్బకు.. తలవంచిన ఐసీసీ.. ఆ నిర్ణయాన్ని మార్చేస్తూ కీలక ప్రకటన..
Bcci
Venkata Chari
|

Updated on: Mar 27, 2023 | 2:31 PM

Share

Indore Pitch: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే మైదానంలోని పిచ్‌పై బీసీసీఐ భారీ విజయాన్ని అందుకుంది. నిజానికి పిచ్ విషయంలో బీసీసీఐ చేసిన ప్రయత్నాలకు ఐసీసీని ఇబ్బందుల్లోకి నెట్టి, విజయం సాధించింది. ఇండోర్ టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. హోల్కర్ స్టేడియం పిచ్ పేలవంగా ఉందని మ్యాచ్ రిఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఇండోర్ టెస్టులో ఉపయోగించిన పిచ్‌కు పేలవమైన రేటింగ్‌ను ఇవ్వడంపై బీసీసీఐ అప్పీల్ చేసింది. ఇండోర్ పిచ్ ఎవరికీ ప్రమాదకరం కాదని బీసీసీఐ వాదించింది. ఆ తర్వాత ఐసీసీ ఈ పేలవమైన రేటింగ్‌కు బదులుగా సగటు కంటే తక్కువ రేటింగ్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఇండోర్ పిచ్ 3 డీమెరిట్ పాయింట్లకు బదులుగా ఒక డీమెరిట్ పాయింట్ మాత్రమే పొందుతుంది.

ఇండోర్‌లోని పిచ్‌లో అసలేం జరిగింది?

ఇండోర్ టెస్ట్ మూడు రోజుల్లో ముగిసిన సంగతి తెలిసిందే. ఇండోర్ టెస్టులో తొలి రోజు 14 వికెట్లు పడిపోయాయి. ఈ మ్యాచ్‌లో 31 వికెట్లలో 26 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఫలితం తర్వాత, పిచ్‌పై ప్రశ్నలు లేవనెత్తిన పెద్ద విషయం తెలిసిందే. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ దానిని హాస్యాస్పదంగా పేర్కొన్నాడు. పిచ్‌పై ఏ బ్యాట్స్‌మెన్‌కు ప్రమాదం జరగలేదని, అయితే ఈ పిచ్ ఎలా చెడ్డదని ప్రశ్నించాడు. మ్యాచ్ రిఫరీ నిర్ణయంపై BCCI అప్పీల్ చేసింది. ఆ తర్వాత ICC పిచ్ రేటింగ్‌ను మార్చవలసి వచ్చింది.

ఇవి కూడా చదవండి

WTC ఫైనల్‌కు చేరిన భారత్, ఆస్ట్రేలియా..

ఇండోర్ టెస్టులో ఓటమి టీమ్ ఇండియాకు ఎలాంటి నష్టం కలిగించలేదు. ఇండోర్ తర్వాత అహ్మదాబాద్ టెస్టు డ్రా కావడంతో టీమ్ ఇండియా 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్‌లో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక జట్టు ఓడిపోయిన వెంటనే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరడం ఖాయమైంది. ఫైనల్‌లో భారత జట్టు, ఆస్ట్రేలియాతో పోటీపడుతుంది. ఈ పోరు జూన్ 7న ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరుకోగా, మరోవైపు టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. గత సారి ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..