Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2024లో అత్యధికంగా సెర్చ్ చేసిన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా? ధోని, కోహ్లీ కూడా వెనుకే

Year in Search 2024: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఈ విషయంలో విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోనీ వంటి దిగ్గజాలను సైతం ఓడించాడు. గూగుల్‌లో హార్దిక్ ట్రెండింగ్‌లో ఉండటానికి నాలుగు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

2024లో అత్యధికంగా సెర్చ్ చేసిన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా? ధోని, కోహ్లీ కూడా వెనుకే
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Dec 11, 2024 | 1:47 PM

Year in Search 2024: 2024లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ క్రికెటర్‌గా భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఈ విషయంలో, అతను విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞులను కూడా ఓడించాడు. హార్దిక్ పాండ్యా ఈ ఏడాది చాలా విషయాల్లో వార్తల్లో నిలిచాడు. విడాకుల నుంచి టీ-20 వరల్డ్ కప్ గెలవడం వరకు అతడిని గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఫలితంగా ఈ ఏడాది అత్యధికంగా శోధించిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ ఏడాది పాండ్యా వార్తల్లోకి రావడానికి గల ప్రత్యేక కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విపరీతమైన ట్రోల్‌కు గురైన హార్దిక్..

హార్దిక్ పాండ్యా కొన్నాళ్ల పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. తర్వాత గుజరాత్ టైటాన్స్ అతడిని కెప్టెన్‌గా చేసింది. ఈ జట్టుతో రెండేళ్లు గడిపిన తర్వాత మళ్లీ ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. అయితే, రోహిత్ శర్మ స్థానంలో అతడిని కెప్టెన్‌గా నియమించారు. ఈ నిర్ణయం ముంబై ఇండియన్స్ అభిమానులకు నచ్చలేదు. మొత్తం IPL సమయంలో ప్రేక్షకులు హార్దిక్‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు. అలాగే అతనిపై అసభ్య పదజాలం వాడారు. హార్దిక్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ప్రదర్శన కూడా పేలవంగా ఉంది.

నటాషా స్టాంకోవిక్ నుంచి విడాకులు..

హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సమయంలో అభిమానుల నుంచి అవమానాలను ఎదుర్కొంటున్న సమయంలో.. అతను తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న ఇబ్బందులతో పోరాడుతున్నాడు. నటాషా స్టాంకోవిచ్‌తో హార్దిక్ పాండ్యా సంబంధం వీగిపోయింది. చివరికి వారిద్దరూ జులై 2024లో తమ విడాకులను అధికారికంగా ధృవీకరించారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత వీరిద్దరూ విడాకుల ద్వారా విడిపోయారు.

ఇవి కూడా చదవండి

తన కొడుకు నుంచి కూడా దూరమైన హార్దిక్..

భార్య నుంచి విడిపోవడంతో పాటు, కొడుకు నుంచి విడిపోయిన బాధను కూడా హార్దిక్ భరించవలసి వచ్చింది. హార్దిక్, నటాషా అగస్త్య పాండ్య అనే కొడుకుకు తల్లిదండ్రులు. అయితే, విడాకుల తర్వాత, నటాషా అగస్త్యను పెంచుతోంది. విడాకుల తర్వాత, నటాషా తన కొడుకుతో కలిసి సెర్బియా వెళ్లి, ఒకటిన్నర నెలల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత హార్దిక్ తన కుమారుడిని కలిశాడు. అగస్త్యతో కలిసి దిగిన వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

టీ-20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత్..

హార్దిక్ పాండ్యా ఈ సంవత్సరం గూగుల్‌లో వార్తల్లోకి రావడానికి కారణం టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను భారత్‌ను గెలుచుకోవడంలో సహాయపడటం. అతను ఈ టోర్నమెంట్‌లో బంతి, బ్యాటింగ్‌తో జట్టుకు అద్భుత ప్రదర్శన చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ చివరి ఓవర్‌లో చిరస్మరణీయమైన బౌలింగ్‌ చేశాడు. చివరి ఓవర్‌లో మిల్లర్‌ భారీ వికెట్‌ పడగొట్టాడు. దీంతో టీమిండియా 7 పరుగుల తేడాతో టైటిల్‌ను కైవసం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..