AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్.. భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ పై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు..

India vs Pakistan: సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్‌తో తలపడేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఈ మ్యాచ్ ఇప్పటికే పలు వివాదాలను సృష్టిస్తోంది. ఈ కీలక మ్యాచ్‌ను బహిష్కరించాలని భారత అభిమానులు పిలుపునిస్తున్నారు. దీనిపై టీమిండియా దిగ్గజ ప్లేయర్ లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

IND vs PAK: ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్.. భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ పై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు..
India Vs Pakistan
Venkata Chari
|

Updated on: Sep 13, 2025 | 8:34 PM

Share

IND vs PAK: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్ పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ కు సంబంధించి వస్తున్న విమర్శల నేపథ్యంలో, ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. మ్యాచ్ ఆడాలా వద్దా అనే తుది నిర్ణయం పూర్తిగా భారత ప్రభుత్వం, బీసీసీఐ చేతుల్లోనే ఉంటుందని గవాస్కర్ తెలిపారు. ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకూడదని చాలామంది అభిమానులు, మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. దీనిపై గవాస్కర్ స్పందిస్తూ, ఆటగాళ్లు కేవలం బీసీసీఐతో ఒప్పందం చేసుకున్న ఉద్యోగులు మాత్రమేనని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వారు ఆడుతున్నారని అన్నారు. “ప్రభుత్వం ఆడమని ఆదేశిస్తే ఆటగాళ్లు ఆడతారు. ఆడవద్దని చెబితే, బీసీసీఐ ఆ నిర్ణయాన్ని అమలు చేస్తుంది. ఈ విషయంలో ఆటగాళ్లకు ఎలాంటి అధికారం ఉండదు. కాబట్టి వారిని నిందించడం అర్థరహితం” అని గవాస్కర్ పేర్కొన్నారు.

ప్రస్తుతం దుబాయ్ లో ఆసియా కప్ 2025 జరుగుతున్న నేపథ్యంలో, భారత్, పాకిస్థాన్ మ్యాచ్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వివాదాల నడుమ ఆటగాళ్లపై విమర్శలు ఆపి, జట్టుకు మద్దతుగా నిలవాలని అభిమానులను గవాస్కర్ కోరారు. భారత జట్టు మంచి ఫామ్ లో ఉందని, ఈ టోర్నీలో గొప్ప ప్రదర్శన చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ పై విజయం సాధించే సత్తా భారత జట్టుకు ఉందని, ముఖ్యంగా యువ ఓపెనర్లు శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారని గవాస్కర్ ప్రశంసించారు. వీరు క్రీజులో నిలబడితే పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తారని, భారీ స్కోరు సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ లేకపోవడం పాక్ కు కొంత ఉపశమనం కలిగించవచ్చని, అయినప్పటికీ భారత జట్టు బలంగా ఉందని గవాస్కర్ తెలిపారు.

మొత్తంగా, భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పై నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించి, తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని గవాస్కర్ మరోసారి స్పష్టం చేశారు. ఆటగాళ్లు తమ పనిని మాత్రమే చేస్తున్నారని, వారిపై అనవసరంగా విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..