IND vs ENG 4th Test: కరుణ్ నాయర్ ఔట్.. గిల్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్.. 4వ టెస్ట్లో గంభీర్ పవర్ ఫుల్ స్కెచ్..
Karun Nair: లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్ పేలవ ప్రదర్శన కారణంగా, టీం ఇండియా 22 పరుగుల తేడాతో మ్యాచ్ను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో, ఐదు టెస్ట్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ సందర్భంగా, భారత మాజీ ఓపెనర్ కరుణ్ నాయర్ను పక్కన పెట్టాలంటూ డిమాండ్ చేశాడు.

Karun Nair: 8 సంవత్సరాల తర్వాత టీం ఇండియాలోకి తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ పేలవ ఫాంతో తీవ్రంగా నిరాశ పరిచాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికే రెండవ, మూడవ టెస్ట్ మ్యాచ్లలో మూడవ స్థానంలో బ్యాటింగ్కు పంపి ఛాన్స్ ఇచ్చాడు. కానీ గంభీర్ ఆశలు పూర్తిగా విఫలమయ్యాయి. గత 6 ఇన్నింగ్స్లలో కరుణ్ నాయర్ ఒక్క అర్ధ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్లో అతని నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించారు. కానీ, క్రీజులో సమయం గడిపిన కరుణ్ ఓ తప్పు షాట్ ఆడి వికెట్ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అతను టీం ఇండియాలోకి తిరిగి రావడం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో పాటు, అతన్ని జట్టు నుంచి తొలగించి సాయి సుదర్శన్ను జట్టులోకి చేర్చాలనే డిమాండ్ ఉంది. కానీ, ఇందులో అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే గౌతమ్ గంభీర్ నాల్గవ టెస్ట్ మ్యాచ్లో కరుణ్ నాయర్ను తొలగిస్తారా? అయితే, భారత మాజీ ఓపెనర్ WV రామన్ కరుణ్ నాయర్ ప్రదర్శనపై ప్రశ్నలు లేవనెత్తారు.
W V రామన్ ఏం చెప్పాడంటే?
టీం ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ కరుణ్ నాయర్ పేలవమైన ప్రదర్శనపై భారత మాజీ ఓపెనర్ డబ్ల్యువి రామన్ మాట్లాడుతూ, కరుణ్కు చాలా అవకాశాలు ఇచ్చారని, కానీ అతను జట్టు యాజమాన్యాన్ని నిరాశపరిచాడని అన్నారు. ఈ సందర్భంగా, ఒక టెస్ట్ తర్వాత సాయి సుదర్శన్ను జట్టు నుంచి తొలగించాలనే నిర్ణయాన్ని ఆయన ప్రశ్నించారు.
సుదర్శన్ ఆ మ్యాచ్ ఆడకుండా ఉండాల్సిందని లేదా అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉండాల్సిందని ఆయన అన్నారు. రెవ్స్పోర్ట్జ్తో మాట్లాడుతూ, సాయి సుదర్శన్కు మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉండాల్సిందని నేను భావిస్తున్నాను. ఒక టెస్ట్ మ్యాచ్లో ఒక ఆటగాడిని ఆడించి, ఆపై అతన్ని బెంచ్ మీద కూర్చోబెట్టడంలో అర్థం లేదంటూ చెప్పుకొచ్చాడు.
జట్టును నిరాశపరిచిన కరుణ్ నాయర్..
ఈ టెస్ట్ సిరీస్లో కరుణ్ నాయర్కు ఎక్కువ అవకాశాలు ఇచ్చారని, కానీ అతను జట్టును నిరాశపరిచాడని ఆయన అన్నారు. కరుణ్ నాయర్ మూడు టెస్ట్ మ్యాచ్లలో 6 ఇన్నింగ్స్లలో 21.83 సగటుతో 131 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 40 పరుగులు. సాయి సుదర్శన్ తన ఏకైక టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో డకౌట్గా నిలిచాడు. కానీ, రెండవ ఇన్నింగ్స్లో 30 పరుగులు మాత్రమే చేశాడు.
నాల్గవ మ్యాచ్లో కరుణ్ నాయర్ను ఆడించే ముందు జట్టు యాజమాన్యం మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని భారత మాజీ ఓపెనర్ అన్నారు. నాల్గవ టెస్ట్ మ్యాచ్లో సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్లకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




