IPL 2024 Playoffs: ప్లేఆఫ్స్‌‌లో ప్లేస్ ఫిక్స్ చేసుకున్న మూడు జట్లు.. ఆ దిగ్గజ టీంలకి నిరాశే

IPL 2024 Playoffs Prediction: ఐపీఎల్ 2024 (IPL 2024) దాదాపు సగం దశకు చేరుకుంది. మ్యాచ్‌లు జరుగుతున్న కొద్దీ టోర్నీలో అన్ని జట్ల స్థానం కూడా స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాయి. కాగా, ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో వారికి ఎలాంటి సమస్య ఉండదని కనిపించే అనేక జట్లు ఉన్నాయి.

IPL 2024 Playoffs: ప్లేఆఫ్స్‌‌లో ప్లేస్ ఫిక్స్ చేసుకున్న మూడు జట్లు.. ఆ దిగ్గజ టీంలకి నిరాశే
Ipl 2024 Playoffs
Follow us

|

Updated on: Apr 18, 2024 | 8:33 AM

IPL 2024 Playoffs Prediction: ఐపీఎల్ 2024 (IPL 2024) దాదాపు సగం దశకు చేరుకుంది. మ్యాచ్‌లు జరుగుతున్న కొద్దీ టోర్నీలో అన్ని జట్ల స్థానం కూడా స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాయి. కాగా, ప్లేఆఫ్‌లకు చేరుకోవడంలో వారికి ఎలాంటి సమస్య ఉండదని కనిపించే అనేక జట్లు ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌లో స్థానాన్ని దాదాపుగా సుస్థిరం చేసుకున్న మూడు జట్ల గురించి ఇప్పుడు చూద్దాం..

3. చెన్నై సూపర్ కింగ్స్.. (8 పాయింట్లు)

ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మూడో స్థానంలో ఉంది. సీజన్ ప్రారంభానికి ముందు, ఎంఎస్ ధోని జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టాడు. అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమించారు. అయితే, ఇది చెన్నై సూపర్ కింగ్స్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేదు. జట్టు అద్భుతమైన ఆటను కనబరిచింది. CSK ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడగా, అందులో 4 గెలిచి కేవలం రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు మూడో స్థానంలో ఉంది. సీఎస్‌కే చూపించిన ఆట తీరు చూస్తుంటే టాప్-4లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

2. కోల్‌కతా నైట్ రైడర్స్.. (8 పాయింట్లు)

గౌతమ్ గంభీర్ వచ్చాక కేకేఆర్ టీమ్ పూర్తిగా మారిపోయింది. ఓపెనింగ్‌లో సునీల్ నరైన్ మరోసారి తుఫాన్ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ టీం కేవలం 2 మ్యాచ్‌ల్లో ఓడిపోవడానికి ఇదే కారణం. పాయింట్ల పట్టికలో కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆ జట్టు వద్ద 8 పాయింట్లు ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్ కారణంగా జట్టు CSK కంటే ముందుంది. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే, జట్టు తన మిగిలిన 8 మ్యాచ్‌లలో 5 లేదా 4 మాత్రమే గెలవాలి. ఇది చాలా సులభం.

1. రాజస్థాన్ రాయల్స్.. (12 పాయింట్లు)

రాజస్థాన్ రాయల్స్ జట్టు దాదాపు ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. మరో మూడు మ్యాచ్‌లు గెలిస్తే 18 పాయింట్లతో పాటు ప్లేఆఫ్‌లో స్థానం ఖాయం అవుతుంది. రాజస్థాన్‌కు ఇంకా 7 మ్యాచ్‌లు మిగిలి ఉండగా వీటిలో 3 మ్యాచ్‌లు గెలవడం పెద్ద విషయం కాదు. ఈసారి జట్టు కూడా పట్టికలో అగ్రస్థానంలో కొనసాగవచ్చు. బహుశా ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలివనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
నేడు ఈ యోగంలో కాలభైరవుడిని పూజించండి.. ఇంట్లో ఆనందం నెలకొంటుంది
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
అతి చవకైన డ్రైఫ్రూట్‌ .! ఇలా తింటే శరీరంలోని ప్రతి భాగాన్ని బలంగా
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సెబీ కొత్త ఆర్డర్‌
కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌
కస్టమర్లకు అలర్ట్‌.. మే నెలలో సగం రోజులు బ్యాంకులు బంద్‌
ఫ్రిడ్జ్‌లో పెట్టినా అల్లం ఎండిపోతుందా.. ఇలా నిల్వ చేయండి
ఫ్రిడ్జ్‌లో పెట్టినా అల్లం ఎండిపోతుందా.. ఇలా నిల్వ చేయండి
గోండు కటీర గురించి విన్నారా..? గోధుమ బంకతో ఊహించని ప్రయోజనాలు
గోండు కటీర గురించి విన్నారా..? గోధుమ బంకతో ఊహించని ప్రయోజనాలు
మరో జస్ప్రీత్ బుమ్రా లోడింగ్.. ఆర్‌సీబీ నెట్ బౌలర్ వీడియో చూస్తే
మరో జస్ప్రీత్ బుమ్రా లోడింగ్.. ఆర్‌సీబీ నెట్ బౌలర్ వీడియో చూస్తే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ పరిమితి పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఆ పరిమితి పెంపు
పాతబస్తీ గల్లీలో పర్యటించనున్న అమిత్ షా
పాతబస్తీ గల్లీలో పర్యటించనున్న అమిత్ షా