IND vs ENG 3rd T20: మలాన్ తుఫాన్ ఇన్నింగ్స్.. రోహిత్ సేన ముందు భారీ టార్గెట్.. విఫలమైన భారత యువ బౌలర్లు..
టీ20 సిరీస్లో మూడో, చివరి మ్యాచ్ నాటింగ్హామ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతోంది. ఇందులో భారత్ ముందు 216 పరుగుల విజయ లక్ష్యం ఉంది.
England vs India 3rd T20I Nottingham: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్లో మూడో, చివరి మ్యాచ్ నాటింగ్హామ్ వేదికగా జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ భారత్ ముందు 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. డేవిడ్ మలన్ తుఫాను ప్రదర్శనతో కేవలం 39 బంతుల్లో 77 పరుగులు చేసి, భారత యువ బౌలర్లపై ప్రతాపం చూపించాడు. అలాగే మరో బ్యాటర్ లియామ్ లివింగ్స్టోన్ కూడా 29 బంతుల్లో 42 పరుగులు చేసి, ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. భారత్ తరపున రవి బిష్ణోయ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 215 పరుగులు చేసింది. ఈ సమయంలో, జాసన్ రాయ్, జోస్ బట్లర్ జట్టు తరపున ఓపెనింగ్ చేశారు. 9 బంతుల్లో 18 పరుగులు చేసి బట్లర్ ఔటయ్యాడు. ఇందులో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. రాయ్ 26 బంతుల్లో 27 పరుగులు చేసి అవుటయ్యాడు. రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. కేవలం 8 పరుగులు చేసి ఫిలిప్ సాల్ట్ ఔటయ్యాడు. 6 బంతుల్లో ఫోర్ కొట్టాడు.
మలాన్ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 77 పరుగులు చేశాడు. మలన్ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. మొయిన్ అలీ తొలి బంతికే ఔటయ్యాడు. ఖాతా కూడా తెరవలేకపోయారు. హ్యారీ బ్రూక్ 9 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 19 పరుగులు చేశాడు. చివర్లో లియామ్ లివింగ్స్టోన్ 29 బంతుల్లో 4 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 11 పరుగుల వద్ద క్రిస్ జోర్డాన్ రనౌట్ అయ్యాడు.
రవి బిష్ణోయ్ భారత్కు ప్రమాదకరంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అవేష్ఖాన్ కూడా విజయాన్ని అందుకున్నాడు. 4 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చాడు. రవీంద్ర జడేజా 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చాడు. అయితే అతనికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. హర్షల్ పటేల్ కూడా బాగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.