AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

27 ఏళ్ళ తర్వాత ఫైనల్‌కు… బోర్డు బంపర్ ఆఫర్!

లార్డ్స్: ఇంగ్లాండ్‌లోని క్రికెట్ అభిమానులకు ఆ దేశ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలబడనున్న ఫైనల్ మ్యాచ్‌ను యూకే అంతటా ఉచితంగా ప్రసారం చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. సబ్‌స్క్రిప్షన్ ధరలు భారీగా ఉండటంతో చాలామంది ఇంగ్లీష్ ఫ్యాన్స్ క్రికెట్ మ్యాచ్‌లను టీవీల్లో వీక్షించడం లేదు. అటు ఇంగ్లాండ్ కూడా 27 ఏళ్ళ తర్వాత వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరడంతో అభిమానుల సంతోషం కోసం బోర్డు ఈ […]

27 ఏళ్ళ తర్వాత ఫైనల్‌కు... బోర్డు బంపర్ ఆఫర్!
Ravi Kiran
|

Updated on: Jul 13, 2019 | 9:05 PM

Share

లార్డ్స్: ఇంగ్లాండ్‌లోని క్రికెట్ అభిమానులకు ఆ దేశ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆదివారం ఆతిధ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలబడనున్న ఫైనల్ మ్యాచ్‌ను యూకే అంతటా ఉచితంగా ప్రసారం చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. సబ్‌స్క్రిప్షన్ ధరలు భారీగా ఉండటంతో చాలామంది ఇంగ్లీష్ ఫ్యాన్స్ క్రికెట్ మ్యాచ్‌లను టీవీల్లో వీక్షించడం లేదు. అటు ఇంగ్లాండ్ కూడా 27 ఏళ్ళ తర్వాత వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరడంతో అభిమానుల సంతోషం కోసం బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయానికి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.