AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: విమానంలో బిజినెస్‌ క్లాస్‌ సీట్లను వదులుకున్న కోచ్‌, కెప్టెన్‌, కోహ్లీ.. కారణమేంటంటే?

టీమ్ ఇండియా విమానం ఎక్కిన తర్వాత కోచ్‌ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్‌ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ తమ బిజినెస్ క్లాస్ సీట్లను మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యాలకు ఇచ్చారు. వారు మాత్రం ఎకానమీ క్లాస్‌లో కూర్చొని జర్నీ చేశారు.

T20 World Cup: విమానంలో బిజినెస్‌ క్లాస్‌ సీట్లను వదులుకున్న కోచ్‌, కెప్టెన్‌, కోహ్లీ.. కారణమేంటంటే?
Team India
Basha Shek
|

Updated on: Nov 08, 2022 | 10:07 AM

Share

టీ20 వరల్డ్ కప్-2022 సెమీ ఫైనల్స్ ఆడేందుకు భారత జట్టు అడిలైడ్ చేరుకుంది. సోమవారం అడిలైడ్‌లో అడుగుపెట్టిన టీమ్‌ఇండియా గురువారం పటిష్ఠమైన ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా మెల్‌బోర్న్ నుంచి టీమ్ ఇండియా ఇక్కడికి వచ్చింది. కాగా జింబాబ్వే మ్యాచ్‌ తర్వాత మెల్‌బోర్న్ నుంచి వెంటనే అడిలైడ్‌కు పయనమైంది. అయితే ఈ ప్రయాణంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అదంటంటే టీమ్ ఇండియా విమానం ఎక్కిన తర్వాత కోచ్‌ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్‌ రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ తమ బిజినెస్ క్లాస్ సీట్లను మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యాలకు ఇచ్చారు. వారు మాత్రం ఎకానమీ క్లాస్‌లో కూర్చొని జర్నీ చేశారు. కాగా విమానంలో బిజినెస్ క్లాస్ సీట్లు ఎంతో విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. విశ్రాంతి తీసుకునేందుకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి.  కాగా  టీ20 ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి వేలాది కిలోమీటర్ల ప్రయాణం చేసింది భారత జట్టు.  ఈనేపథ్యంలో బౌలర్లకు తగిన విశ్రాంతి ఇచ్చేందుకు గానూ మెన్‌ అండ్‌ బ్లూ తమ బిజినెస్ క్లాస్ సీట్లను బౌలర్లకు కేటాయించింది.

కాగా జట్టులోని ప్రతి ఆటగాడికి బిజినెస్ క్లాస్ సీటు లభించదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం ఒక్కో జట్టుకు నాలుగు బిజినెస్ క్లాస్ సీట్లు లభిస్తాయి. చాలా జట్లు తమ కెప్టెన్, వైస్-కెప్టెన్, కోచ్, మేనేజర్‌లకు ఈ సీట్లను అప్పగిస్తారు. అయితే టీమ్ ఇండియా గత కొన్ని రోజులుగా వరుసగా ప్రయాణాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కీలకమైన సెమీస్‌ మ్యాచ్‌కు ముందు ఫాస్ట్ బౌలర్లకు తగిన విశ్రాంతి ఇవ్వాలన్న భావనతో వారికి బిజినెస్‌ క్లాస్‌ సీట్లు ఇచ్చారు. కాగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య సెమీస్‌ మ్యాచ్‌ గురువారం (నవంబర్‌10) జరగనుంది. అడిలైడ్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఇరు జట్లు కఠినంగా సాధన చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?