AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌..! ప్రధాని మోదీ నుంచి లెటర్‌..

చెతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతని సేవలను ప్రశంసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. పుజారా అద్భుతమైన కెరీర్‌ను కలిగి ఉన్నాడు, 103 టెస్టులు ఆడి, 7195 పరుగులు సాధించాడు. ప్రధాని లేఖకు కృతజ్ఞతలు తెలిపాడు పుజారా.

రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా క్రికెటర్‌..! ప్రధాని మోదీ నుంచి లెటర్‌..
Pujara Pm Modi
SN Pasha
|

Updated on: Aug 31, 2025 | 7:11 PM

Share

టీమిండియా మాజీ క్రికెటర్‌ చతేశ్వర్ పుజారా ఇటీవలె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే పుజారా క్రికెట్ వైభవాన్ని ప్రశంసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పుజారాకు లేఖ రాశారు. ఆ లేఖకు స్పందిస్తూ రిటైర్మెంట్‌పై శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపాడు పుజారా. “మన గౌరవనీయ ప్రధానమంత్రి నుండి నా రిటైర్మెంట్ సందర్భంగా ప్రశంసా లేఖ అందుకోవడం నాకు గౌరవంగా ఉంది. నేను నా రెండవ ఇన్నింగ్స్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు, మైదానంలో ప్రతి జ్ఞాపకాన్ని, నాకు లభించిన ప్రేమ, ప్రశంసలను నేను ఎంతో గుర్తుంచుకుంటాను. ధన్యవాదాలు సర్” అని పుజారా ఎక్స్‌లో లేఖను పంచుకుంటూ రాశారు.

ఆగస్టు 24న పుజారా తన రిటైర్మెంట్ ప్రకటించాడు, 43.60 సగటుతో 103 టెస్టులు, 7,195 టెస్ట్ పరుగుల అద్భుతమైన కెరీర్‌ను ముగించాడు. అతను తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఐదు వన్డేలు కూడా ఆడాడు. చివరిగా 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారతదేశం తరపున ఆడాడు. టెస్టుల్లో భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచిన పుజారా, 21,301 ఫస్ట్ క్లాస్ పరుగులు సాధించి, 2019/20లో రంజీ ట్రోఫీ గెలిచిన సౌరాష్ట్ర జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

భారత క్రికెట్‌కు ఆయన చేసిన కృషిని ప్రశంసిస్తూ ప్రధాని మోదీ ఆ లేఖలో ఇలా రాశారు.. “క్రికెట్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లు ఆధిపత్యం చెలాయించే యుగంలో, మీరు సాంప్రదాయ ఫార్మాట్ అందాన్ని గుర్తు చేశారు. మీ అజేయమైన స్వభావం, గొప్ప ఏకాగ్రతతో ఎక్కువ గంటలు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం మిమ్మల్ని భారత బ్యాటింగ్ లైనప్‌కు మద్దతుగా నిలిచాయి. మీ అత్యుత్తమ క్రికెట్ కెరీర్‌లో అద్భుతమైన నైపుణ్యం, సంకల్పం క్షణాలు ఉన్నాయి’ అని ప్రధాని మోదీ లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి