AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: స్వ్కాడ్‌లో లక్కీఛాన్స్.. ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు

Match Fee For Border Gavaskar Trophy: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్‌లో 5 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమిండియాకు ఇద్దరు ఆటగాళ్ళు అరంగేట్రం చేశారు. కొంతమంది ఆటగాళ్లు ఒకటే మ్యాచ్ ఆడవలసి వచ్చింది. అయితే, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, తనుష్ కోటియన్‌లకు కూడా అవకాశం రాలేదు.

Team India: స్వ్కాడ్‌లో లక్కీఛాన్స్.. ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
Sarfaraz Khan Abhimanyu Easwaran And Tanush Kotian
Venkata Chari
|

Updated on: Jan 06, 2025 | 7:46 AM

Share

Match Fee For Border Gavaskar Trophy: భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసింది. ఆతిథ్య ఆస్ట్రేలియా 3-1 తేడాతో గెలిచి ఈ సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో టీమ్ ఇండియాలోని చాలా మంది ఆటగాళ్ళు ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. దీని కారణంగా ప్రతి టెస్ట్‌లో ప్లేయింగ్ ఎలెవెన్‌లో మార్పులు జరిగాయి. కొంతమంది ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. మరికొందరు పునరాగమనం చేశారు. అయినప్పటికీ, ఈ మొత్తం సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. అయినప్పటికీ, ఈ ముగ్గురు ఆటగాళ్లు సంపాదనలో ఏమాత్రం తగ్గేదేలే అంటూ వెనకేసేశారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు- సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, తనుష్ కోటియన్.

ఈ సిరీస్‌లో నితీష్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణాలు టీమ్‌ఇండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశారు. దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణలకు ఒక్కో మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. సిరీస్ ప్రారంభం నుంచి ఇద్దరూ జట్టులో భాగమైనప్పటికీ, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్‌లు బెంచ్‌పై కూర్చున్నారు. కాగా, బ్రిస్బేన్ టెస్టు తర్వాత రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ కారణంగా స్పిన్ ఆల్ రౌండర్ తనుష్ కోటియన్‌ను చివరి 2 టెస్టులకు జట్టులోకి తీసుకున్నారు.

ఈ ముగ్గురికి ఆడే అవకాశం రాకపోయినా డబ్బు కూడా సంపాదించారు. బీసీసీఐ తరపున టెస్ట్ మ్యాచ్ ఆడినందుకు ప్రతి ఆటగాడికి మ్యాచ్ ఫీజు రూ.15 లక్షలు. అదే సమయంలో, ఒక ఆటగాడు జట్టులో ఉన్న తర్వాత కూడా ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోలేకపోతే, అతను ఆ మ్యాచ్‌కి రూ. 7.5 లక్షలు కూడా అందుకుంటాడు. అయితే, గత ఏడాదే బీసీసీఐ టెస్టు ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించడం ద్వారా మ్యాచ్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం, ఒక టెస్ట్ సీజన్‌లో 50 శాతం టెస్ట్ ఆడే సభ్యుడు రూ. 30 లక్షలు, నాన్ ప్లేయింగ్ ఎలెవెన్ మెంబర్‌కు రూ. 15 లక్షలు అందుకుంటారు. 75 శాతం మ్యాచ్‌లు ఆడే సభ్యుడు రూ. 45 లక్షలు, ఆడని సభ్యునికి రూ. 22.5 లక్షలు అందుకుంటుంటారు.

ఇవి కూడా చదవండి

దీని ప్రకారం సర్ఫరాజ్, ఈశ్వరన్, కోటియన్ ఎంత ఫీజు తీసుకున్నారు? ఈ సీజన్‌లో టీమ్ ఇండియా 10 టెస్టులు ఆడింది. ఇందులో సర్ఫరాజ్ 8 మ్యాచ్‌ల్లో భాగమయ్యాడు. అంటే, అతను మ్యాచ్‌లో 75 శాతానికి పైగా భాగమయ్యాడు. వీటిలో, అతను ఆస్ట్రేలియాలో 5 మ్యాచ్‌లలో బెంచ్‌పై కూర్చున్నాడు. ఈ కోణంలో చూస్తే ఈ 5 మ్యాచ్‌లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.22.5 లక్షల ఫీజుగా అందుకోనున్నాడు. ఈ విధంగా సర్ఫరాజ్ కు రూ.1,12,50,000 లభిస్తుంది. ఈశ్వరన్ 50 శాతం అంటే 5 మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 5 మ్యాచ్‌లకు రూ.15 లక్షలకు బదులు రూ.75 లక్షలు అందుకుంటాడు. కోటియన్ విషయానికి వస్తే, అతను కేవలం 2 మ్యాచ్‌లకు మాత్రమే జట్టులో భాగమయ్యాడు, అందువల్ల అతను ప్రోత్సాహక పథకం కిందకు రాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ.7.5 లక్షలు వస్తాయని, రూ.15 లక్షలు సంపాదించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..