AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy 2025: ఆరంభం అదిరింది.. మరి టీమిండియా సెమీస్ చేరాలంటే? లెక్కలివిగో

సుమారు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలుచుకునే లక్ష్యంతో టీమిండియా దుబాయ్ లోకి అడుగు పెట్టింది. అందుకు తగ్గట్టుగానే మొదటి మ్యాచ్ లో విజయం సాధించి మెగా టోర్నీలో శుభారంభం చేసింది. మరి టీమిండియా సెమీఫైనల్స్ సమీకరణాలేంటో తెలుసుకుందాం రండి.

Champions Trophy 2025: ఆరంభం అదిరింది.. మరి టీమిండియా సెమీస్ చేరాలంటే? లెక్కలివిగో
ప్రస్తుతం, భారత జట్టు పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ తర్వాత రెండవ స్థానంలో ఉంది. గ్రూప్ దశలో టీమిండియా చివరి మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్‌తో జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంటుంది. కానీ, ఆ పరిస్థితిలో కూడా, దాని సెమీ-ఫైనల్ మ్యాచ్ తేదీ మారదు. మార్చి 4న భారత్ సెమీఫైనల్ ఆడుతుంది.
Basha Shek
|

Updated on: Feb 21, 2025 | 10:57 AM

Share

12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియాకు మొదటి మ్యాచ్ లో శుభారంభం లభించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మొదటి మ్యాచ్ చూశాక దుబాయ్‌లో విజయాలు సాధించడం టీమ్ ఇండియాకు అంత ఈజీ కాదనిపిస్తోంది. బంగ్లాదేశ్ టీమిండియా చాలా కష్టపడి నెగ్గింది. ఈ టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ, టీమ్ ఇండియా తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతోంది. గ్రూప్ దశలో తొలి మ్యాచ్ , గురువారం (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్‌తో జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 228 పరుగులు చేసింది.ఆ తర్వాత మ్యాచ్‌లో టీం ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంలో మహమ్మద్ షమీ (5/53), శుభ్‌మాన్ గిల్ (101 నాటౌట్) కీలక పాత్రలు పోషించారు. ఈ విజయం టీమిండియా సెమీఫైనల్ అవకాశాలను సుగమం చసింది. గ్రూప్ దశలో టీం ఇండియా ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మరి టీం ఇండియా సెమీఫైనల్లోకి ఎలా ప్రవేశిస్తుంది? దాని వెనుక ఉన్న సమీకరణాలేంటో తెలుసుకుందాం రండి.

న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ విజయంతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత జట్టు రెండో స్థానంలో ఉంది. రెండు జట్లకు చెరో రెండు పాయింట్లు ఉన్నాయి. కానీ రన్ రేట్ లో కివీస్ అగ్ర స్థానంలో ఉంది. సెమీఫైనల్ చేరాలంటే నెట్ రన్ రేట్ ముఖ్యం. న్యూజిలాండ్ 1.200తో మొదటి స్థానంలో ఉంది. భారతదేశం 0.408 తో రెండవ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ (-0.408) మూడో స్థానంలో, పాకిస్తాన్ (-1.200) నాలుగో స్థానంలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

సెమీఫైనల్ చేరాలంటే టీం ఇండియాకు ఒకే ఒక్క విజయం అవసరం. టీం ఇండియా తదుపరి మ్యాచ్ మార్చి 23న పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో జరగనుంది. రెండు మ్యాచ్‌లు కఠినమైనవే. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌ను ఓడించినట్లయితే టీం ఇండియా సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. కాబట్టి, ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం టీం ఇండియాకు చాలా ముఖ్యం. పాక్ పై విజయం సాధిస్తే భారత్ 4 పాయింట్లతో గ్రూపులో మొదటి స్థానంలోకి చేరుకుంటుంది. ఇదే జరిగితే టోర్నీలో పాకిస్తాన్ కథ ముగిసినట్లే. 23వ తేదీన జరిగే మ్యాచ్ లో టీం ఇండియా ఓడిపోతే, ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూజిలాండ్ ను ఓడించాల్సిందే.

ఛాంపియన్స్ ట్రోఫీ పాయింట్ల పట్టిక..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us