AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC CT 2025: షాకింగ్ న్యూస్.. పాక్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ఔట్.. ఐసీసీ చూపు ఈ మూడు దేశాలపైనే?

ICC Champions Trophy 2025: పాకిస్థాన్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నాయి. దుబాయ్‌లో కూడా నిర్వహించవచ్చని కొద్దిరోజుల క్రితమే మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఒక్క మ్యాచ్ కూడా పాకిస్తాన్‌లో జరగదని తెలుస్తోంది.

ICC CT 2025: షాకింగ్ న్యూస్.. పాక్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ఔట్.. ఐసీసీ చూపు ఈ మూడు దేశాలపైనే?
Ind Vs Pak
Venkata Chari
|

Updated on: Oct 09, 2024 | 7:55 PM

Share

ICC Champions Trophy 2025: పాకిస్థాన్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి చాలా చర్చలు జరుగుతున్నాయి. దుబాయ్‌లో కూడా నిర్వహించవచ్చని కొద్దిరోజుల క్రితమే మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఒక్క మ్యాచ్ కూడా పాకిస్తాన్‌లో జరగదని తెలుస్తోంది. కాగా, పాకిస్థాన్ స్థానంలో ఈ టోర్నీని నిర్వహించేందుకు మూడు దేశాల పేర్లు ముందుకు వచ్చాయంట.

రేసులో మూడు దేశాలు..

స్పోర్ట్స్ టాక్ ప్రకారం ఐసీసీ ఇప్పుడు పాకిస్తాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం మూడు ప్రణాళికలపై పని చేస్తోంది. ఇందులో మూడవ ప్రణాళికలో ఇప్పుడు ఈ టోర్నమెంట్‌ను పూర్తిగా పాకిస్తాన్ నుంచి మార్చవచ్చు అని తెలుస్తోంది. దీనికి మూడు దేశాల పేర్లు ఎంపిక చేశాయని చెబుతున్నారు. ఇందులో దుబాయ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా పేర్లు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల టోర్నీని పాకిస్థాన్‌లో నిర్వహించలేకపోతే, మొత్తం టోర్నీని ఈ మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంలో నిర్వహించవచ్చని తెలుస్తోంది. అయితే అధికారిక హోస్టింగ్ మాత్రం పాకిస్థాన్‌తోనే ఉంటుంది.

ఐసీసీ మిగిలిన రెండు ప్రణాళికలు ఏంటంటే?

ఐసీసీకి ఉన్న మరో రెండు ఆప్షన్‌లను పరిశీలిస్తే, టోర్నీ మొత్తం పాకిస్థాన్‌లోనే జరగాలనేది మొదటి ఎంపిక. అయితే రెండవ ఎంపికలో హైబ్రిడ్ మోడల్ ఉంటుంది. దీని ప్రకారం, టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడవచ్చు. సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లో జరుగుతాయి.

టీమిండియా పాకిస్థాన్ వెళ్లడం దాదాపు అసాధ్యం..

అదే సమయంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి పొందడం దాదాపు అసాధ్యమని తెలుస్తోంది. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు దానిని ఎలాగైనా పూర్తి చేయాలని కోరుతోంది. ఇందుకోసం స్టేడియం పునరుద్ధరణ పనులను కూడా వేగవంతం చేశారు. అయితే, టీమ్ ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లకపోతే, హైబ్రిడ్ మోడల్‌లో లేదా పూర్తిగా పాకిస్థాన్ వెలుపల ఆడవచ్చు అని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..