AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2023: మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్.. గ్రాండ్‌గా ఏర్పాట్లు.. సందడి చేయనున్న కియారా, కృతి సనన్..

మహిళల ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 4 నుంచి ప్రారంభమవుతుంది. ఇది మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్. తొలి సీజన్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు బీసీసీఐ పూర్తి స్థాయిలో సన్నాహాలు ప్రారంభించింది.

WPL 2023: మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్.. గ్రాండ్‌గా ఏర్పాట్లు.. సందడి చేయనున్న కియారా, కృతి సనన్..
Wpl 2023
Venkata Chari
|

Updated on: Mar 01, 2023 | 8:52 PM

Share

మహిళల ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 4 నుంచి ప్రారంభమవుతుంది. ఇది మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్. తొలి సీజన్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు బీసీసీఐ పూర్తి స్థాయిలో సన్నాహాలు ప్రారంభించింది. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.

ఈ మ్యాచ్‌కు ముందు, బాలీవుడ్ నటీమణులు కియారా అద్వానీ, కృతి సనన్ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో వీరిద్దరితో పాటు ప్రముఖ పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ కూడా తన పాటలతో అభిమానులను అలరించనున్నాడు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసి సమాచారం అందించింది. ఈ గ్రాండ్‌ సెలబ్రేషన్‌పై ఫ్యాన్స్‌ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ మెగా టీ20 లీగ్ గురించి మాట్లాడితే, దాని మొదటి సీజన్‌లో మొత్తం ఐదు జట్లు పాల్గొంటాయి. ఇందులో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ పేర్లు ఉన్నాయి. టోర్నీలో లీగ్ మ్యాచ్‌ల తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి. దీని తర్వాత మార్చి 26న ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు ఫైనల్స్‌లోకి నేరుగా ప్రవేశం పొందుతుంది. అక్కడ ఎలిమినేటర్ విజేతతో తలపడుతుంది.

WPL 2023 వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా స్మృతి మంధాన నిలిచింది. ఫిబ్రవరి 13న జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ వేలంలో స్మృతి మంధాన అత్యధిక సంపాదనతో ముందంజలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 3 కోట్ల 40 లక్షలు వెచ్చించి మంధానను తమ జట్టులో చేర్చుకుంది. అయితే, రాబోయే సీజన్‌లో, భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ మంధాన ఆర్‌సీబీ జట్టుకు నాయకత్వం వహిస్తుంది. మార్చి 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆర్‌సీబీ తన తొలి మ్యాచ్ ఆడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి