AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Retirement: షాకింగ్ న్యూస్.. రోహిత్ బాటలోనే కోహ్లీ.. రిటైర్మెంట్ ప్రకటించిన రన్ మెషీన్..?

Virat Kohli Test retirement: రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నిర్ణయం గురించి ఆయన బీసీసీఐకి కూడా తెలియజేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. విరాట్ ఈ నిర్ణయంతో రాబోయే ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టులో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అంటున్నారు.

Virat Kohli Retirement: షాకింగ్ న్యూస్.. రోహిత్ బాటలోనే కోహ్లీ.. రిటైర్మెంట్ ప్రకటించిన రన్ మెషీన్..?
Virat Kohli Test Retirement
Follow us
Venkata Chari

|

Updated on: May 10, 2025 | 8:36 AM

Virat Kohli Test Retirement: రెండు రోజుల క్రితం, భారత దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు చాలామంది షాక్ అయ్యారు. ఫ్యాన్స్ చాలా బాధపడ్డాడు. ఇప్పుడు క్రికెట్ అభిమానులకు మరో బిగ్ షాక్ తగలబోతోంది. ఎందుకంటే ఇప్పుడు, రోహిత్ తర్వాత, విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయమై బీసీసీఐ గురించి తెలియజేశాడు. ఈ నిర్ణయం తర్వాత, రాబోయే ఇంగ్లాండ్ పర్యటనకు విరాట్ భారత జట్టులో భాగం కావడం కష్టమేనని తెలుస్తోంది.

అయితే, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని బోర్డు ఉన్నతాధికారి ఒకరు కోహ్లీని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనకు జట్టును ప్రకటించేటప్పుడు కోహ్లీ భవిష్యత్తుకు సంబంధించి సెలక్షన్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడుతూ కనిపించాడు. అక్కడ, భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-3 తేడాతో కోల్పోయింది. సిరీస్‌లోని తొలి మ్యాచ్ అయిన పెర్త్ టెస్ట్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. కానీ, ఆ తర్వాత పరుగుల కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

విరాట్ కంటే ముందే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బుధవారం (మే 7) టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. మే 7న, అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కథనాన్ని పంచుకున్నాడు. రెడ్-బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే, అతను ఇప్పటికీ వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాచ్‌లు ఆడటం కొనసాగిస్తాడు. గత ఏడాది వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత 38 ఏళ్ల రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు.

2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ లాగే కోహ్లీ కూడా అతి చిన్న ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇటువంటి పరిస్థితిలో, ఇప్పుడు క్రికెట్ అభిమానులు రోకో (రోహిత్, కోహ్లీ) జంటను వన్డేల్లో మాత్రమే ఆడటం చూడొచ్చు. వారిద్దరూ ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ ఆడుతున్నారు. కానీ, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా టోర్నమెంట్ వాయిదా పడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..