CWG 2022: భారత్ ఖాతాలో మరో బంగారు పతకం.. టేబుల్ టెన్నిస్లో రెండోసారి..
2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఇదే ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది.

CWG 2022 Table Tennis: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఐదో స్వర్ణం సాధించింది. టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో సింగపూర్పై భారత్ 3-1తో విజయం సాధించింది. జి సత్యన్, హర్మీత్ దేశాయ్ తమ సింగిల్స్ మ్యాచ్లను గెలుపొందారు. అలాగే డబుల్స్ మ్యాచ్లోనూ గెలిచారు. దీంతో బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో టేబుల్ టెన్నిస్లో భారత్కు తొలి పతకం వచ్చింది. ఫైనల్లో పురుషుల టీమ్ ఈవెంట్లలో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈవెంట్ ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసిన భారత జట్టు ఫైనల్లోనూ శుభారంభం చేసింది. ఇప్పటికే గ్రూప్ దశలో సింగపూర్ను 3-0తో ఓడించిన భారత జట్టు ఫైనల్ మ్యాచ్లో పూర్తి భిన్నంగా సాగింది. భారత్ తరపున, హర్మీత్ దేశాయ్, జి సత్యన్ జంట తమ డబుల్స్ మ్యాచ్ను 3-0తో గెలిచి భారత్కు 1-0 ఆధిక్యాన్ని అందించారు. దీని తరువాత, భారతదేశం ఆశలు CWG చరిత్రలో అత్యంత అనుభవజ్ఞుడైన, అత్యంత విజయవంతమైన భారతీయ పాడ్లర్ అయిన ఆచంట శరత్ కమల్పై ఉన్నాయి. సింగిల్స్ మ్యాచ్లో గట్టిపోటీని ఎదుర్కొన్నప్పటికీ, 4 గేమ్లపాటు జరిగిన మ్యాచ్లో ఆచంట 1-3తో ఓడిపోయింది.
ఈ మ్యాచ్ 1-1తో సమం కావడంతో రెండో సింగిల్స్లో భారత్కు బలమైన పునరాగమనం అవసరం అయింది. జి సత్యన్ ఈ మ్యాచ్లో మొదటి గేమ్లోనే ఓడిపోయాడు. అయినప్పటికీ, అతను పట్టుదలను వదులుకోలేదు. తరువాతి మూడు గేమ్లలో తిరిగి వచ్చి 3-1తో మ్యాచ్ను గెలుచుకున్నాడు. భారతదేశం ఆధిక్యాన్ని 2-1కి తీసుకెళ్లాడు.




వెయిట్ లిఫ్టింగ్ పురుషుల 96 కేజీల విభాగంలో భారత్కు చెందిన వికాస్ ఠాకూర్ రజతం సాధించాడు. అదే సమయంలో ఐదో రోజు మహిళల లాన్ బాల్స్ ఫైనల్లో టీమిండియా 17-10తో దక్షిణాఫ్రికాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.




