AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2022: రెండో రోజు సత్తా చాటిన అథ్లెట్స్.. రజతంతో ఖాతా తెరిచన భారత్.. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లో విజయాలు..

ఈ రోజు భారతీయులు 11 క్రీడలలో పాల్గొంటున్నారు. 23 స్వర్ణాలు ఫణంగా ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, హాకీ సహా 11 క్రీడాంశాల్లో భారత్ సత్తా చాటనుంది.

CWG 2022: రెండో రోజు సత్తా చాటిన అథ్లెట్స్.. రజతంతో ఖాతా తెరిచన భారత్.. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లో విజయాలు..
Sanket Sargar Silver Medal
Venkata Chari
|

Updated on: Jul 30, 2022 | 4:29 PM

Share

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ పతకాల ఖాతా రెండోరోజు తెరిచింది. శనివారం జరిగిన పురుషుల 55 కేజీల విభాగంలో వెయిట్‌లిఫ్టర్ సంకేత్ మహదేవ్ రజత పతకాన్ని సాధించాడు. మలేషియాకు చెందిన మహ్మద్ అనీద్ స్వర్ణం సాధించాడు. స్నాచ్‌లో తొలి ప్రయత్నంలోనే సంకేత్ 107 కిలోల బరువు ఎత్తాడు. రెండో ప్రయత్నంలో 111 కిలోలు, మూడో ప్రయత్నంలో 113 కిలోలు ఎత్తాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో తన తొలి ప్రయత్నంలోనే సంకేత్ 135 కిలోల బరువును ఎత్తాడు. కానీ, అతని రెండవ, మూడవ ప్రయత్నాలు విఫలమయ్యాయి. 248 కేజీలతో రెండో స్థానంలో నిలిచాడు. మలేషియా వెయిట్‌లిఫ్టర్ మొత్తం 249 కేజీలను ఎత్తి కేవలం 1 కేజీ తేడాతో సంకేత్‌ను అధిగమించాడు.

టేబుల్ టెన్నిస్: గయానాపై భారత్ 3-0తో విజయం..

టేబుల్ టెన్నిస్ మహిళల జట్టు గ్రూప్-2లో భారత జట్టు గయానాపై 3-0 తేడాతో సులువుగా గెలిచింది. తొలిరోజు కూడా సులువైన విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ 1: శ్రీజ అకుల, రీత్ టెన్నిసన్ 11-5, 11-7, 11-9తో నటాలీ కమ్మింగ్స్, చెల్సియాను ఓడించారు. మరో మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో రీత్ టెన్నిసన్ ఇ చెల్సియాపై 2-0 ఆధిక్యంలో ఉంది.

మ్యాచ్ 2: స్టార్ పాడ్లర్ మానికా బాత్రా 11-1, 11-3, 11-3తో టి థామస్‌ను ఓడించింది. దీంతో టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది.

మ్యాచ్ 3: రెండవ సింగిల్స్‌లో, రెట్ టెన్నిసన్ 11-7, 14-12, 13-11తో E చెల్సియాను ఓడించాడు.

బ్యాడ్మింటన్: లక్ష్య సేన్ విజయం..

భారత జట్టు 2-0 ఆధిక్యం బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ గ్రూప్ దశలో శ్రీలంకపై భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. భారత మొదటి డబుల్స్ మ్యాచ్‌లో భారత జంట సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, అశ్విని పొన్నప్ప 21-14, 21-9 తేడాతో సచిన్ దాస్, థిలిని హెండహేవాపై గెలిచారు.

పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 21-18, 21-5తో నిలుకా కరుణరత్నేపై విజయం సాధించింది. తాజాగా మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ 21-3, 21-9తో విద్రా సుహాసనిపై విజయం సాధించింది.

లాన్ బాల్: భారత్-మాల్టా మ్యాచ్ టై..

లాన్ బాల్ టీమ్ ఈవెంట్‌లో భారత్, మాల్టా 16-16తో సమంగా నిలిచాయి. మహిళల సింగిల్స్‌లో తానియా చౌదరి ఓడిపోయింది. ఆమె 21-10తో లారా డేనియల్స్ చేతిలో ఓడిపోయింది.

ఈ రోజు భారతీయులు 11 క్రీడలలో పాల్గొంటున్నారు. 23 స్వర్ణాలు ఫణంగా ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, హాకీ సహా 11 క్రీడాంశాల్లో భారత్ పాల్గొంటుంది. ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మ్యాచ్ రాత్రి 8:00 గంటలకు జరుగుతుంది.